Kishan Reddy : తాను ఏ ప్రాజెక్టునూ అడ్డుకోలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని.. తాను తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడే వ్యక్తిని కాదంటూ చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ కిషన్ రెడ్డి వల్లే మెట్రో రెండో దశ పనులు ఆగిపోయాయని ఆరోపించారు. తన మిత్రుడు కేసీఆర్ (kcr) హయాంలో కాని పని ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డికి పేరొస్తుందనే ఉద్దేశంతోనే మెట్రో రెండో దశ పనులు కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను అడ్డుకునే వ్యక్తిని కాదని.. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేసినట్టు గుర్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుదని.. అదే ఫాలో అవుతారంటూ చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి.