Hyderabad Cyber ​​Crime Police [image credit; al]
తెలంగాణ

Hyderabad Cyber ​​Crime Police: సైబర్ క్రిమినల్స్ బారిన పడ్డారా?.. గంటలోనే ఫిర్యాదు చేయండి.. డీసీపీ కవిత

Hyderabad Cyber ​​Crime Police: సైబర్​ క్రిమినల్స్​ చేతుల్లో మోసపోయిన 54మంది బాధితులకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఊరట కల్పించారు. బాధితులు పోగొట్టుకున్న 3.27 కోట్ల రూపాయల నగదును వారికి వాపసు ఇప్పించారు. ఏయేటికాయేడు రెచ్చిపోతున్న సైబర్​ నేరగాళ్లు రకరకాలుగా మోసాలు కొనసాగిస్తూ వందల కోట్ల రూపాయలను కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలిగా స్టాక్​ ట్రేడింగ్​, ఇన్వెస్ట్​ మెంట్​ పేర 32మందిని లూటీ చేశారు.

మేము చెప్పినట్టుగా పెట్టుబడులు పెట్టండి…రూపాయికి పది రూపాయలు లాభం సంపాదించండంటూ వాట్సాప్​ ద్వారా టార్గెట్​ గా చేసుకున్న వారిని ఉచ్ఛులోకి లాగి కోటీ 62 లక్షల రూపాయలను లూటీ చేశారు. ఫెడెక్స్​ కొరియర్​ పేర మరో 14మందిని బెదరగొట్టి కోటీ 57 లక్షల రూపాయలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. ఇక, క్యూఆర్​ కోడ్​ ఫ్రాడ్​ మోసానికి పాల్పడి ఓ వ్యక్తి నుంచి 43వేల రూపాయలను స్వాహా చేశారు.

 Also Read; Telangana Group 1: గ్రూప్ 1 నియామకాలకు వీడిన అడ్డంకి.. త్వరలో సర్టిఫికెట్స్ పరిశీలన!

మీ క్రెడిట్​ కార్డు వివరాలను అప్​ డేట్​ చేయాల్సి ఉందంటూ మరో వ్యక్తిని ఉచ్ఛులోకి లాగి 89వేల రూపాయలను కొల్లగొట్టారు. నలుగురు బాధితులను కస్టమర్​ కేర్​ ఫ్రాడ్​ మోసానికి గురి చేసి మరో 3.70లక్షల రూపాయలను లూటీ చేశారు. ఇద్దరు వ్యక్తులకు ఏపీకే ఫైళ్లను పంపించి వారి ఫోన్లను హ్యాక్​ చేసి 3.39లక్షల రూపాయలను కొల్లగొట్టారు. ఈ మేరకు ఫిర్యాదులు అందగా కేసులు నమోదు చేసిన హైదరాబాద్​ సైబర్​ క్రైం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆయా బ్యాంకుల నోడల్​ అధికారులతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకుని సైబర్​ క్రిమినల్​ ఖాతాల్లో జమ అయిన డబ్బును ఫ్రీజ్​ చేయించారు. అనంతరం 12వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్​ కోర్టు మెజిస్ట్రేట్​ అనూష నుంచి అనుమతులు తీసుకుని మొత్తం 54మంది బాధితులకు శుక్రవారం 3.27 కోట్ల రూపాయలను తిరిగిచ్చారు.

మొదటి గంటలోనే…
సైబర్​ క్రిమినల్స్​ బారిన పడ్డవారు నేరం జరిగిన మొదటి గంటలోపే ఫిర్యాదు చేయాలని సైబర్​ క్రైం డీసీపీ డీ.కవిత సూచించారు. అలా చేస్తే సైబర్​ మోసగాళ్ల బ్యాంక్​ ఖాతాల్లోని డబ్బును ఫ్రీజ్​ చేయించే అవకాశం ఉంటుందన్నారు. గంట దాటితే తమ ఖాతాల్లో జమ అయిన డబ్బును ఇతర అకౌంట్లలోకి మార్చుకుని సైబర్ క్రిమినల్స్​ స్వాహా చేస్తారని చెప్పారు. సీబీఐ, ఆర్బీఐ, ఈడీ, కస్టమ్స్​, నార్కొటిక్​ అధికారులమంటూ అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్​ కాల్స్​ కు భయపడవద్దని చెప్పారు.

ఏ ప్రభుత్వ అధికారి కూడా స్కైప్​ యాప్​ ద్వారా ఫోన్​ కాల్స్​ చేయరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కేసులు నమోదు చేయకుండా ఉండటానికి..కేసుల నుంచి తప్పించటానికి డబ్బులు డిమాండ్​ చేయరని చెప్పారు. నిజానికి దేశంలో ఎక్కడా డిజిటల్​ అరెస్ట్​ విధానం అమల్లో లేదని తెలిపారు. ఇక, రూపాయికి పది రూపాయల లాభం సంపాదించండి అంటూ అపరిచితులు వాట్సాప్​, టెలిగ్రాం, ఎక్స్​, ఇన్​ స్టాగ్రాం, ఫేస్​ బుక్​ ల ద్వారా పంపించే మెసెజీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు.

 Also Read; Sri Rama Navami: భద్రాద్రిలో ముమ్మరంగా శ్రీరామనవమి ఏర్పాట్లు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

సెబీలో రిజిష్టర్​ అయి ఉండే ఫైనాన్షియల్​ అడ్వయిజర్​ సలహాల మేరకే పెట్టుబడులు పెట్టాలన్నారు. పరిచయం లేని వారి నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్​ ను క్లిక్​ చేయవద్దన్నారు. జాగ్రత్తగా ఉన్నా సైబర్​ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్​ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పారు. వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు నగదు వాపసు అందటంలో కీలకపాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని ఆమె అభినందించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు