KGBV Bunker Beds: బంకర్ బెడ్స్ టెండర్లపై హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయాల్లో(కేజీబీవీ) బంకర్ బెడ్స్ కొనుగోలులో సమారు రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని విచారణ జరిపించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. టెండర్లను నిబంధనకు విరుద్దంగా కేటాయించారని మైక్రో, స్మాల్ అండ్ మీడియా ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ సైతం ఆరోపించింది. హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పటిషన్ (డబ్ల్యూపీ నెం. 40073 ఆఫ్ 2025)పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి.
పిటిషన్పై తుది నిర్ణయం
2025 ఏప్రిల్ 26 నాటి బంకర్ బెడ్స్ టెండర్/బిడ్ డాక్యుమెంట్, తదుపరి సప్లిమెంటరీ అగ్రిమెంట్లపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, గతేడాది డిసెంబర్ 18న విజిలెన్స్ ఫిర్యాదుపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డి కోరారు. శుక్రవారం కోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిట్ పిటిషన్పై తుది నిర్ణయం వెలువడే వరకు, ప్రతివాదులు బంకర్ బెడ్స్, మ్యాట్రెస్, పిల్లోస్ సరఫరాకు సంబంధించి టెండర్/బిడ్పై ఎటువంటి తదుపరి చర్యలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల కాపీ ఇంకా హైకోర్టు రిజిస్ట్రీ నుంచి అందాల్సి ఉన్నది.
Also Read: Raakaasaa Glimpse: సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్ వచ్చేశాయ్ చూశారా.. నిహారిక రెండో సినిమా

