AP TG Water Dispute: సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్ రావు
Harish Rao Warns of Water Injustice to Telangana
Telangana News

AP TG Water Dispute: గురుదక్షిణ కోసం.. తెలంగాణకు ద్రోహం చేస్తారా? సీఎంను నిలదీసిన హరీశ్ రావు

AP TG Water Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల (Water Disputes) పరిష్కారం కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర జల సంఘం భేటి కాబోతోంది. కాసేపట్లో దిల్లీలో ఈ భేటి మెుదలు కానుండగా.. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. దిల్లీ కేంద్రంగా తెలంగాణకు జలద్రోహం జరగబోతోందంటూ ఆరోపణలు చేశారు. ఈ భేటిలో ఏదైనా తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డే గా మిగిలిపోతుందన్నారు. జల ద్రోహం విషయంలో కత్తి చంద్రబాబు (CM Chandrababu)ది అయితే పొడిచేది రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరో చారిత్రక ద్రోహం

సమైక్య పాలనలో నీటి వాటాల్లో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్.. నేడు మరో చారిత్రక ద్రోహం చేయబోతోందని హరీశ్ రావు ఆరోపించారు. ఈరోజు దిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్ ప్రభుత్వం మరణ శాసనం రాయబోతోందని ఆరోపించారు. ‘పోలవరం, నల్లమల సాగర్ విషయంలో రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తున్నది. పోను పోను అనుకుంటూనే ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి దిల్లీ మీటింగ్ కు వెళ్ళారు. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపారు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాల హక్కులను కాలరాసారు’ అని హరీశ్ రావు అన్నారు.

ఏపీ జల దోపిడీకి కార్పెట్

కమిటీ వేయను అంటూనే రెండు రాష్ట్రాల అధికారుల ఆధ్వర్యంలో కమిటీ వేసి ఏపీ జల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేశారని హరీశ్ రావు ద్వజమెత్తారు. ‘టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్ళి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపారు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్ కు మద్దతు ప్రకటించారు. పక్కా ప్లాన్ ప్రకారం సహకరిస్తూ.. చంద్రబాబుకు రేవంత్ గురు దక్షిణ చెల్లిస్తున్నారు. ఏపీ ఒత్తిడితో జరుగుతున్న మీటింగ్ లో ఇవాళ ఇంజినీర్లు పాల్గొంటున్నారు. పేరుకు జలవివాదాల మీటింగ్ కానీ, మన 200 టీఎంసీలను గంపగుత్తగా తరలించుకుపోయే నల్లమలసాగర్ అనే ప్రాజెక్టు సంబంధించిన కుట్ర ఇది’ అని హరీశ్ రావు ఆరోపించారు.

Also Read: Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌కు మరోమారు సిట్ నోటీసులు!

తెలంగాణకు ద్రోహం

గతంలో కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్వహించిన సమావేశంలో ఏపీ నల్లమల సాగర్ ప్రాజెక్టునే ఏకైక ఎజెండాగా ముందుపెట్టిందని హరీశ్ రావు గుర్తుచేశారు. ‘ఇప్పుడు కూడా ఏపీ నల్లమలసాగర్‌ లింకు ప్రాజెక్టునే తెరమీదకు తెచ్చి చర్చ చేస్తున్నారు. ఎందుకు ఈరోజు మీటింగ్ కు ఎగేసుకొని పోయారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోడు, మీరైనా ఎందుకు పట్టించుకోరు ఉత్తం గారు. ఈ మీటింగ్ కు వెళ్లేది ఆదిత్యా నాథ్. గతంలో 9వ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న ఆదిత్యా నాథ్ దాస్.. కాళేశ్వరం, గోదావరి, సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టు, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, చనాక కొరటా, రామప్ప డైవర్షన్ లు అన్నీ అక్రమ ప్రాజెక్టులు, వీటిని నిలిపి వేయాలని చెప్పాడు. తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగునా వ్యతిరేకించిన వ్యక్తిని మీటింగ్ కు పంపడం అంటే తెలంగాణ ద్రోహం చేయడానికే కాదా?’ అని హరీశ్ రావు నిలదీశారు.

Also Read: Husband Suicide: షాకింగ్ ఘటన.. పెళ్లైన 2 నెలలకే భార్య జంప్.. తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?