Southern DPGs Meeting: నానాటికి పెరిగిపోతున్న సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు సమిష్టి చర్యలు తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు నిర్ణయించారు. దీంట్లో భాగంగా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవటంతోపాటు ఆయా బ్యాంకులు, టెలికాం సంస్థలతో సమన్వయాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించారు. డీజీపీ కార్యాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరీల డజీపీల కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది.
ఇందులో భాగంగా వేర్వేరు రకాలుగా జరుగుతున్న సైబర్ మోసాలపై విస్తృతస్థాయిలో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని అధికారులు అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాల బాధితులకు సత్వర న్యాయం అందించటానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. క్రిప్టో కరెన్సీ నేరాలను తగ్గించటానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించారు.
సమావేశానికి డీజీపీ జితేందర్ అధ్యక్షత వహించగా సీఐడీ డీజీ షిఖా గోయల్, ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారులు రాజేశ్ కుమార్, సందీప్ మిట్టల్, వెంకటేశ్, రవికృష్ణ, మనోజ్ కే.మీనా, అనూప్ శెట్టి, చైతన్య, హర్షవర్ధన్, దేవేందర్ తదితరులు వర్చువల్ గా పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు