MMTs To Yadagirigutta: హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ ప్రాజెక్టును ఎప్పటి వరకు పూర్తి చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ..ఈ ఎంఎంటీఎస్ ప్రాజెక్టుతో ఘట్కేసర్ ప్రాంతం , యాదాద్రి మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
కేంద్రం ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టును ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో? తెలియడం లేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి లో నిధులు కేటాయించి ఎంఎంటీఎస్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎంపీ కోరారు.
Also read: Trump Tariffs on India: ట్రంప్ ఎంత పని చేశాడు? వాటి ధరలు అమాంతం పైపైకి..