నిజామాబాద్ స్వేచ్ఛ :NFBS scheme: జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ.20,000/- ఆర్థిక సహాయం అందజేయబడుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) వర్తిస్తుందని అన్నారు.
Also Read: MLA Donthi Madhava Reddy: దొంతి కి మంత్రి పదవి? ఛాన్స్ ఇవ్వాలని వేడుకోలు..
ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే, అతని వయస్సు 18 ఏళ్లు పైబడి, 60 ఏళ్లలోపు ఉండాలని అన్నారు. అర్హులైన వారు మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు