CM Revanth Reddy: నక్సలైట్ల చర్చలపై జానారెడ్డి సలహాలు ఉత్తమం
CM Revanth Reddy (imagecredit:swetcha)
Telangana News

CM Revanth Reddy: నక్సలైట్ల చర్చలపై జానారెడ్డి సలహాలు ఉత్తమం.. రేవంత్ రెడ్డి

తెలంగాణ: CM Revanth Reddy: నక్సలైట్ల చర్చలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి సలహాలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్​భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉన్నదని వివరించారు.

మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకుంటామన్నారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కమిటీ నేతలు సీఎంను కోరగా, సానుకూలంగా స్పందించారు. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందన్నారు.

Also Read: Leaders are Confused: గులాబీ గుబాళిస్తే.. కమలం పరిస్థితేంటి అయోమయంలో ఆ పార్టీ నేతలు

శాంతిభద్రతల అంశంగా ఎట్టి పరిస్థితుల్లో పరిగణించవద్దన్నారు. మంత్రులతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ లు ఉన్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?