CM Revanth Reddy | అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం
CM Revanth Reddy
Telangana News, హైదరాబాద్

మా హక్కులను వదులుకోము… తేల్చి చెప్పిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ విలువల పరిరక్షణ, విద్యా వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆదివారం ఆయన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగ పరిరక్షణపై జరుగుతున్న చర్చపై ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ దార్శనికతతో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం కేవలం సర్టిఫికెట్లు జారీ చేసే పాత్రను అధిగమించి, సామాజిక సవాళ్లను పరిష్కరించే కేంద్రంగా పనిచేయాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సామాజిక బాధ్యతగా అంబేద్కర్ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లిన ఘనత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పౌరులకు విద్యను పొందకుండా చేసే హక్కు ఏ అధికారానికీ లేదని నొక్కి చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించామని తెలిపారు. రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యావ్యవస్థను పునరుద్ధరించడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

20 ఏళ్ల తర్వాత దళిత వర్గానికి చెందిన విద్యావేత్త ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా నియమితులవడం గర్వంగా ఉందన్నారు. విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేయాలని యూనివర్సిటీ వీసీలను ఆదేశించిన ముఖ్యమంత్రి, దాని అమలుకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

మా హక్కులను వదులుకోము…

విశ్వవిద్యాలయాల ప్రైవేటీకరణకు సీఎం రేవంత్ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాటి పునర్నిర్మాణం, అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిబంధనలకు ప్రతిపాదించిన మార్పులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. UGC నిబంధనలు మార్చి విశ్వ విద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలని కేంద్రం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. యూనివర్సిటీలపై నియంత్రణను కేంద్రీకరించడం వల్ల అవి విభజన ప్రచారానికి వేదికలుగా మారుతాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

UGC నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కు తీసుకోవాలని సీఎం డిమాండ్ చేశారు. మా హక్కులను వదులుకోవడానికి మేం సిద్ధంగా లేము అని తేల్చి చెప్పారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే నిరసనలు తప్పవని రెడ్డి స్పష్టం చేశారు. ఇక పద్మ అవార్డుల్లో వివక్షపై మరోసారి సీఎం ధ్వజమెత్తారు. పద్మ అవార్డుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను విస్మరించిందన్నారు. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులను పక్కన పెట్టడం పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానికి అధికారికంగా లేఖ రాయనున్నట్లు తెలిపారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?