Telangana High Court | హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు
telangana high court
Telangana News

Telangana High Court | హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు ముగ్గురు జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం అదనపు జడ్జీలుగా ఉన్న వీరిని పర్మినెంట్ జడ్జీలుగా నియమించాలని బుధవారం జరిగిన సమావేశంలో కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్, జస్టిస్ కళాసికం సుజన అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. వీరిని పర్మినెంట్ జడ్జీలుగా ఎలివేట్ చేయాలని కొలీజియం నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తెలపగానే వీరు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవలే నలుగురు జ్యుడిషియల్ అధికారులను రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కొలీజియం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది. దీంతో ముగ్గురు అదనపు జడ్జీలు పర్మినెంట్ జడ్జీలయ్యేందుకు మార్గం సుగమమైంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?