Janasena Party Won the Seats In AP: ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ఈ నేపథ్యంలో కౌంటింగ్ మొదలు కావడంతో ఏపీలో ఎవరు గెలుస్తారనే దాని గురించి ఏపీ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ వైసీపీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు ఏపీ ప్రజలంతా. ఇక ఇదిలా ఉంటే అసలు ఏపీలోనే మోస్ట్ అవైటెడ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఎవరూ గెలుస్తారనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవర్స్టార్ పవన్కల్యాణ్ అనూహ్యంగా అత్యధిక మెజార్టీని సాధించి పిఠాపురం పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఆయన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీత మీద ఘనవిజయాన్ని సాధించారు. అందరూ అనుకున్నట్లుగానే మొదటి నుండి జనసేన పార్టీ గెలుస్తుందని భావించిన అభిమానులు, జనసైన్యం కార్యకర్తలు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఇక పవన్ కల్యాణ్ గెలిచిన వార్తలు వినిపించడంతో సోషల్మీడియా వేదికగా పవన్ కల్యాణ్కు రాజకీయ, సినీ ప్రముఖుల నుండి అభినందనల వెల్లువ షురూ అయింది.ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాలీవుడ్ సెలెబ్రెటీస్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.
The Present & Future of Andhra Pradesh is now in safe hands.
POWER STORM @JanaSenaParty 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/zM3QPlt7WZ
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024