Congress Government Changes Haritha Haram Name As Indhira Vana Prabha
సూపర్ ఎక్స్‌క్లూజివ్

HarithaHaram: హరితహారం కాదు, ఇందిర వనప్రభ..

Congress Government Changes Haritha Haram Name As Indhira Vana Prabha: ప్రతిఏటా తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారాన్ని తీసుకొచ్చింది. అటవీ, పర్యావరణ శాఖలు చేపడుతున్న హరితహారం పేరును కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిర వనప్రభగా మార్చనున్నట్లు సమాచారం. ప్రతి వర్షాకాలం నుండే మొక్కలు నాటే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో మొదలుపెట్టారు. పదేళ్లు ఇది హరితహారంగానే కొనసాగింది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హరితహారం పేరుని మార్చాలని భావించారు. ఈ క్రమంలోనే దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరును కలుపుతూ ఇందిర వనప్రభగా వచ్చేటట్టుగా ఈ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కాగా 2004-14 మధ్యన ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సైతం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది.


అప్పట్లో దీనికి వన యజ్ఞం అని పేరు పెట్టారు. తాజా నిర్ణయంతో హరితహారం ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌, ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ తదితర ఉన్నతాధికారుల హోదాకు ముందు ఇందిర వనప్రభ పేరును చేర్చనున్నారు. వర్షాకాలంలో ఈ కార్యక్రమం కింద మొక్కలు నాటి సంరక్షించడం, నర్సరీలను ఏర్పాటు చేయడం, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల అభివృద్ధి తదితరాలను చేపట్టనున్నారు. రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్ధలాల్లో నీడనిచ్చే మొక్కలను పెంచనున్నారు. కోతులు, ఇతర పక్షుల కోసం ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇంటి ఆవరణలో పండ్లనిచ్చే మొక్కలు నాటడం, వాటిని పెంచడంపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడతారు. విద్యార్థులకు పచ్చదనం ప్రాధాన్యం వివరించనున్నారు. ఇవన్నీ ఇప్పటివరకు తెలంగాణకు హరితహారం పేరుతో జరిగాయి.

Also Read: సోనియా..ఆగయా


ఇకపై ఇందిర వనప్రభ కింద కొనసాగనున్నాయి. కలప, పండ్లనిచ్చే మొక్కలు, ప్లాంటేషన్‌ నమూనాలకు ఏర్పాటు చేసిన బోర్డులు మారనున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపునకు సేకరిస్తున్న హరిత నిధి, ఇకపై ఇందిర వనప్రభ నిధి కానుంది. ప్రజలు, ఉద్యోగుల ద్వారా విరాళాల రూపంలో వస్తున్న ఈ నిధులను జిల్లాకు ఒకటి చొప్పున సెంట్రల్‌ నర్సరీల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్‌ కోసం మొక్కల పెంపకం, అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల్లో పనులు, దశాబ్ది సంపద వనాల పేరుతో సాగునీటి శాఖ పరిధిలో ఉన్న మిగులు భూమిలో వనాల పెంపకానికి ఖర్చు చేస్తున్నారు. ప్రతి రూపాయికి పక్కా లెక్క, జవాబుదారీతనంతో పనులు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. కేటాయింపులు, ఖర్చు వివరాలను ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?