TEJA-SAJJA(IMAGE :X)
ఎంటర్‌టైన్మెంట్

Teja Sajja: అనుదీప్ గురించి నిజాలు బయట పెట్టిన తేజ సజ్జా!.. అలా చెప్పేశాడేంటి భయ్యా..

Teja Sajja: తేజ సజ్జా నటించిన పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’ సెప్టెంబర్ 12న విడుదలవుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే హీరో తేజ సజ్జా అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేయడంలో బిజీ బిజీ గా ఉంటున్నారు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ గురించి సంచలన నిజాలు బయటపెట్టారు. అనుదీప్ కథ సరిగ్గా చెప్పడని అందుకే అతనితో చేయాల్సిన ఒక సినిమా చేయలేదన్నారు. ముందుగా ‘జాతి రత్నాలు’ కథ తన దగ్గర వినిపించాడని, చెప్పే విధానం కట్టె కొట్టె తెచ్చె లాగా ఉంటుందని వివరించాడు. కథలో క్లారిటీ లేక అందుకే అనుదీప్ తో సినిమా చేయలేక పోయానని చెప్పుకొచ్చారు. అలాగే వారిద్దరి ఎలా పిలుచుకుంటారో కూడా తెలిపారు. అనుదీప్ తనకు కాల్ చేసి ‘చింటూ ఏడున్నావ్ ఏం చేస్తున్నావ్’ అంటూ ఉంటాడని చెప్పుకొచ్చారు. దీంతో ‘అంత మంచి హిట్ ఎలా మిస్ చేసుకున్నావు గురూ’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Read also-Kalyani Priyadarshan: ‘కొత్త లోక’ విడుదలకు ముందు దుల్కర్ సల్మాన్ కల్యాణీకి ఏం చెప్పాడంటే.. అందుకేనా ఆ కలెక్షన్స్

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ఒక భారీ పాన్-ఇండియా యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. ‘మిరాయ్’ అనే టైటిల్ జపనీస్ పదం, దీని అర్థం ‘భవిష్యత్తు కోసం ఆశ’. ఈ సినిమా అశోకుడి కళింగ యుద్ధం తర్వాత రహస్య గ్రంథాలను కాపాడే తొమ్మిది మంది యోధుల కథ ఆధారంగా రూపొందింది. ఇందులో పురాణ చారిత్రక అంశాలు ఫాంటసీతో మేళవించబడ్డాయి. తేజ సజ్జా సూపర్ యోధుడి పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్‌గా, రితికా నాయక్ హీరోయిన్‌గా, శ్రియా శరణ్ తల్లి పాత్రలో, జగపతి బాబు, జయరాం వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. గౌర హరి సంగీతం అందించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read also-Anuparna Roy: వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చరిత్ర సృష్టించిన దర్శకురాలు.. ఇది కదా కావాల్సింది

ఈ చిత్రం యాక్షన్, ఫాంటసీ, డివోషనల్ ఎలిమెంట్స్‌తో పాటు అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 60 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా, ఓటిటి, శాటిలైట్ హక్కుల ద్వారా 45 కోట్లు, తెలుగు థియేట్రికల్ రైట్స్ ద్వారా 24.5 కోట్ల రూపాయలు రాబట్టి, విడుదలకు ముందే లాభాలను అందుకుంది. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం 2 గంటల 49 నిమిషాల రన్‌టైమ్‌తో రూపొందింది. సెప్టెంబర్ 7న విశాఖపట్నంలో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ‘హనుమాన్’ సినిమాతో పాన్-ఇండియా స్థాయిలో విజయం సాధించిన తేజ సజ్జా, ‘మిరాయ్’తో మరో బ్లాక్‌బస్టర్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించేలా ఉంటుందని తేజ సజ్జా చెప్పారు. దీంతో థియేటర్లలో ఈ సినిమా అనుభవం ఒక విజువల్ స్పెక్టాకిల్‌గా ఉండనుంది.

Just In

01

Illegal Sand Mining: యథేచ్ఛగా అధికారుల అండతో.. అక్రమ మట్టి దందా?

CM Revanth Reddy: నెత్తిన నీళ్లు చల్లుకున్నంత మాత్రాన.. వాళ్ల పాపాలు తొలగిపోవు.. సీఎం రేవంత్

Crime News: తండ్రిని హత్య చేసి.. డెడ్‌బాడీ పక్కన నిద్రపోయిన కొడుకు

Rajinikanth- Kamal Haasan: ఇద్దరు పెద్ద హీరోలతో ఒక సక్సస్‌ఫుల్ దర్శకుడు.. ఇక బాక్సాఫీస్ బద్దలే

Raashii Khanna: రాశీ ఖన్నా ఎమోషనల్ అయింది.. తెలుసు కదా!