స్వేచ్ఛ, సినిమా: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ గుండెల్లో సెగలు రేపి, ‘మం గళవారం’ మూవీతో మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) ఈ సారి పాన్ ఇండియా సినిమాతో రాబోతోంది. 6 భాషల్లో ‘వెంకటలచ్చిమి’గా ఎంట్రీ ఇవ్వబోతోంది. రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ‘వెంకటలచ్చిమి’ మూవీ శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) మాట్లాడుతూ.. “మం గళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను. నచ్చక రిజెక్ట్ చేశాను. డైరెక్టర్ ముని ‘వెంకటలచ్చిమి’ కథ చెప్పగానే చాలా నచ్చేసింది. ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది. నా కెరీర్ కి నెక్స్ట్ లెవెల్ గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నిలిచిపోతుందనే నమ్మకం ఉంది.” అని అన్నారు.