Nandamuri Family ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Nandamuri Family: నందమూరి ఇంట తీవ్ర విషాదం.. జయకృష్ణ సతీమణి పద్మజ కన్నుమూత

Nandamuri Family: నందమూరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నందమూరి జయకృష్ణ భార్య శ్రీమతి పద్మజ ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. శ్రీమతి పద్మజ, నందమూరి తారక రామా రావు , శ్రీమతి బసవరామ తారకం పెద్ద కోడలు . జయ కృష్ణ భార్య, దగ్గుబాటి వెంకటేశ్వర రావు సోదరి కూడా. గత కొంత కాలం నుంచి పద్మజ ఆనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఎదురు కావడం తో ఈరోజు తెల్లవారుజామున హాస్పిటల్ లో చేర్పించారు. అయితే, తెల్లవారు జామున ఆమె మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఈ వార్తతో నందమూరి కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ వార్త తెలిసి విజయవాడ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు , ఢిల్లీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి బయలుదేరారని నందమూరి కుటుంబ సభ్యులు తెలిపారు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు