Kalki 2: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘కల్కీ 2898 AD’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. పురాణాలను సైన్స్ ఫిక్షన్కు జోడించి తీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా సీక్వల్ (పార్ట్-2) గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ చిత్రంలో కీలకమైన ‘సుమతి’ పాత్ర పోషించిన దీపికా పదుకొణె స్థానంలో సాయి పల్లవి నటించబోతోందని సమాచారం.
Read also-Sita Ramam 2: ‘సీతారామం 2’ లేదన్నారు?.. వైరల్ అవుతున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఫోటోలు..
మొదటి భాగంలో ‘సుమతి’ పాత్రలో దీపికా పదుకొణె అద్భుతంగా నటించింది. కల్కీకి జన్మనిచ్చే తల్లిగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టుకున్నాయి. అయితే, సీక్వల్ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఆమె కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తుండటం మరియు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చిత్ర బృందం కూడా కథలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో ఈ మార్పుకు మొగ్గు చూపినట్లు వినిపిస్తోంది.
సాయి పల్లవి ఎంట్రీ
సుమతి పాత్ర చాలా హుందాగా, సహజంగా ఉండాలి. ఆ పాత్రలో ఉండే లోతును పండించాలంటే అద్భుతమైన నటన అవసరం. అందుకే దర్శకుడు నాగ అశ్విన్ ఛాయిస్ సాయి పల్లవి అని టాక్. సాయి పల్లవికి ఉన్న ‘నేచురల్ స్టార్’ ఇమేజ్ ఆ పాత్రకు మరింత బలాన్ని ఇస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ సినిమాకు పెద్ద అసెట్ అవుతుంది. ప్రభాస్ పక్కన ఇప్పటివరకు సాయి పల్లవి నటించలేదు, కాబట్టి ఈ కొత్త జోడీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతుంది.
Read also-Shruti Haasan: దమ్ము కొడుతూ.. దుల్కర్ సినిమాలో మరో తార లుక్ అదిరింది
మొదటి భాగం ముగింపులో ప్రభాస్ ‘కర్ణుడు’ అని తేలడంతో, రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ), కమల్ హాసన్ (యాస్కిన్) పాత్రల మధ్య జరిగే యుద్ధంలో సుమతి పాత్రే కీలకం. అటువంటి ప్రాముఖ్యత ఉన్న పాత్రలో సాయి పల్లవి కనిపిస్తే, అది సినిమా రేంజ్ను మరో స్థాయికి తీసుకెళ్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, దాదాపు సాయి పల్లవి కన్ఫామ్ అయిందని, త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, వెండితెరపై ప్రభాస్ – సాయి పల్లవి కాంబినేషన్ ఒక అద్భుతమని చెప్పవచ్చు.

