Naga Chaitanya: హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండేల్ మూవీతో హిట్ కొట్టి ఎట్టకేలకు రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అయితే, నాగ చైతన్యకి సంబందించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వెంకీ మామ లవర్ తో నాగచైతన్యనటించబోతున్నారని తెలుస్తుంది. మరి, చైతూ తో రొమాన్స్ చేయబోతున్న ఆ హీరోయిన్ ఎవరో ఇక్కడ చూద్దాం..
Also Read: Saraswati Pushkaralu:సరస్వతి పుష్కరాల్లో మంత్రి తుమ్మల సందర్శన.. అభివృద్ధి పనులపై సమీక్ష!
నాగచైతన్య, విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండుతో ఓ కొత్త మూవీ చేస్తున్న విషయం మనకి తెలిసిందే. అయితే, ఈ మూవీలో హీరోయిన్ గా కొందరి పేర్లు వచ్చాయి. ముందుగా.. పూజ హెగ్డే పేరు వచ్చింది.. ఇటీవలే ఎక్కువ ఫ్లాప్స్ రావడంతో ఈ బుట్ట బొమ్మని పక్కన పెట్టేసారట. ఆ తర్వాత నేషనల్ క్రష్ రష్మిక అనుకున్నారు. కానీ, ఆవిడ బిజీగా ఉండటంతో యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఒకే చేశారని తెలుస్తుంది. అయితే, ఈ మూవీలో నాగచైతన్య, మీనాక్షి మధ్య బోల్డ్ రొమాన్స్ కూడా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం, ఈ వార్త నెట్టింట వైరల్ గా మారడంతో నెటిజన్లు రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.