Purushaha: ‘పురుష:’ ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. ‘జీవితం అంటే పోరాటం, ఓర్పు, సహనం’ వంటి మధ్య తరగతి కుటుంబాలను గుర్తు చేసేలాంటి కంటెంట్తో, కేవలం పోస్టర్లతోనే భారీ హైప్ని సొంతం చేసుకున్న చిత్రం ‘పురుష:’ (Purushaha). పోస్టర్స్తోనే అందరి దృష్టిని ఆకర్షించవచ్చని ‘పురుష:’ టీం నిరూపిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన డిఫరెంట్ పోస్టర్స్, ఆ పోస్టర్ల పై ఉండే ఫన్నీ క్యాప్షన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ముగ్గురు హీరోల పాత్రలకు సంబంధించిన పోస్టర్లు, వారి పాత్రని తెలియజేసేలా ఉండే క్యాప్షన్స్ అందరినీ మెప్పించగా, తాజాగా హీరోయిన్ల పాత్రల్ని రివీల్ చేస్తూ వారి లుక్స్ను రివీల్ చేస్తున్నారు మేకర్స్. అదీ కూడా వినూత్నంగానే ఉండటం విశేషం.
Also Read- Meesaala Pilla Song: 100 మిలియన్ వ్యూస్తో 2025 బిగ్గెస్ట్ చార్ట్బస్టర్గా ‘మీసాల పిల్ల’!
అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ
ఇక తాజా అప్డేట్ విషయానికి వస్తే.. ఈ పోస్టర్స్ విడుదల ప్రక్రియలో భాగంగా వైష్ణవి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయగా మంచి స్పందనను రాబట్టుకుంది. ‘కంటి చూపుతో కాదు కన్నీళ్లతో చంపేస్తా’ అని వైష్ణవి పాత్రకు ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఇప్పటికీ ఆ పోస్టర్ సోషల్ మాధ్యమాలలో తిరుతూనే ఉంది. బుధవారం హాసిని సుధీర్ పాత్రకు సంబంధించిన లుక్ను, నేచర్ను రివీల్ చేశారు. హాసిని సుధీర్ (Hasini Sudheer) సినిమాలో సప్తగిరి (Saptagiri)కి జోడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సప్తగిరిని హాసిని ఓ ఆట ఆడుకుంటుందనే హింట్ని బహు చక్కగా మేకర్స్ ఈ పోస్టర్తో రివీల్ చేశారు. ఈ పోస్టర్కు ‘పాపం అల్లాడి పోతున్నాడమ్మ బిడ్డ’ అనే క్యాప్షన్ను జోడించారు. ఈ క్యాప్షన్ చూస్తుంటే హాసిని చేతిలో సప్తగిరికి చిత్తడి చిత్తడి అవుతున్నట్టుగా కనిపిస్తోంది.
Also Read- Fan Wars: ‘జల్సా’ రీ రిలీజ్.. థియేటర్లో మహేష్ అభిమానిపై పవన్ ఫ్యాన్స్ దాడి!
బాక్సింగ్ గ్లౌస్ మధ్యలో..
ఆమె చేతికి ఉన్నటువంటి బాక్సింగ్ గ్లౌస్, ఆ మధ్యలో సప్తగిరిని చూస్తుంటే వీరి పాత్రలు, వారి మధ్య వచ్చే సీన్లు ఆడియెన్స్ను ఎంతగా నవ్విస్తాయో అర్థం అవుతోంది. ఇలా పోస్టర్లతోనే చిత్రంపై మంచి బజ్ను క్రియేట్ చేసి అంచనాల్ని పెంచేస్తున్నారు మేకర్స్. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బత్తుల కోటేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాకు వీరు వులవల దర్శకత్వం వహిస్తుండగా.. సినిమాటోగ్రఫర్గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్గా కోటి, ఆర్ట్ డైరెక్టర్గా రవిబాబు దొండపాటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి వారంతా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

