Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..
Dharma Mahesh Mandi (image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Dharma Mahesh: ధర్మ మహేష్.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. ‘సింధూరం’, ‘డ్రింకర్ సాయి’ చిత్రాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ధర్మ మహేష్.. ఈ మధ్య కాలంలో బిజినెస్ రంగంలోనూ దూసుకెళుతున్నారు. రీసెంట్‌గా తెలంగాణ స్టేట్‌లో స్టార్ట్ చేసిన బిజినెస్‌ను ఇప్పుడు మరో స్టేట్‌లోనూ విస్తరించారు. జిస్మత్ జైలు మండి పేరుతో ఆయన రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ బిజినెస్‌ను ఏపీలోనూ ఆయన మొదలెట్టారు. గుంటూరులో జిస్మత్ జైలు మండి రెస్టారెంట్ 3వ బ్రాంచ్‌ను ప్రారంభించారు.

Also Read- DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

వెయ్యి మంది భారీ బైక్ ర్యాలీ

ఈ బ్రాంచ్ ఓపెన్ నిమిత్తం గుంటూరులో సుమారు వెయ్యి మంది భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం విశేషం. డిసెంబర్ 11న గుంటూరులో జిస్మత్ జైలు మండి రెస్టారెంట్ మూడవ బ్రాంచ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఒక నెల వ్యవధిలోనే ఆయన ఇలా మూడో బ్రాంచ్ ఓపెన్ చేసి.. ఈ బిజినెస్‌లో ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో తెలియజేశారు. ఇది వేగంగా విస్తరిస్తున్న తన ఆహార సంస్థలో మరో ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. డిసెంబర్ 11న సాయంత్రం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ధర్మ మహేష్‌కు ఆయన అభిమానులు ఘనంగా స్వాగతించారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జిస్మత్ మండి అనేది ధర్మ మహేష్‌‌కు చాలా వ్యక్తిగత, భావోద్వేగ క్షణం, ఎందుకంటే జిస్మత్ లోని ‘J’ అక్షరం తన కుమారుడు జగద్వాజను సూచిస్తుంది, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయనతో పాటు తల్లి కాకాని అరుణ, తండ్రి కాకాని వెంకటేశ్వరరావు, సోదరి కాకాని భాగ్య లక్ష్మి, జిస్మత్ న్యాయ సలహాదారు, హైకోర్టు న్యాయవాది ఎన్ నాగూర్ బాబు ఉన్నారు.

Also Read- RajaSaab Second Single: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ సెకండ్ సింగిల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్.. వచ్చేది ఎప్పుడంటే?

కుమారుడికి అంకితం

వాస్తవానికి మహేష్ జిస్మత్ ప్రయాణం 2017లో గుంటూరులో గిస్మత్ అరబిక్ మండీతోనే ప్రారంభమైంది. ఇది దాని ప్రత్యేకమైన జైలు మండి, అరబిక్ మండిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా ఒక బ్రాండ్‌గా రూపాంతరం చెందింది. అప్పటి నుంచి ఈ బ్రాండ్ 17కి పైగా శాఖలకు విస్తరించింది, దాని ప్రామాణికమైన రుచులు, విలక్షణమైన భోజన అనుభవంతో బలమైన ఆదరణను సంపాదించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, మహేష్ తన బ్రాండ్ పేరును జిస్మత్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చడం ద్వారా వ్యాపారాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ బ్రాండ్‌ను విస్తరించేందుకు ఆయన ప్లాన్స్ చేస్తున్నారు. గిస్మత్ నుంచి జిస్మత్‌ గా రీబ్రాండ్ చేసి, కొత్త పేరును తన కుమారుడు జగద్వాజకు అంకితం చేశారు. ఇప్పుడీ బ్రాండ్ గుంటూరులో మొదలవడంతో ధర్మ మహేష్‌కు అతని కుమారుడు జగద్వాజతో భావోద్వేగ ప్రయాణాన్ని కూడా సూచిస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు