Akira Nandan: అకీరా నందన్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పు
Delhi High Court emblem alongside a young man exiting a court premises, representing a legal petition matter.
ఎంటర్‌టైన్‌మెంట్

Akira Nandan: అకీరా నందన్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పు.. వారికి నోటీసులు!

Akira Nandan: తమ పర్సనాలిటీ రైట్స్ కాపాడాలని, తమ పేరు, గొంతు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనల కోసం లేదంటే, అసభ్యకరంగా వాడకూడదని సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయిస్తూ మధ్యంతర ఉత్తర్వులు పొందుతున్నారు. ఆ లిస్ట్‌లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, రజనీకాంత్ నుంచి మన తెలుగు హీరోలైన చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు వంటి వారంతా ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ (Akira Nandan) కూడా చేరారు. ఏఐ ఉపయోగించి తనపై రూపొందించిన చిత్రంతో హర్టయిన అకీరా నందన్.. తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read- Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్రేజీ అప్డేట్.. ఇక ఫ్యాన్స్‌కి పండగే!

అకీరా నందన్‌కు ఉపశమనం

అకీరా నందన్ దాఖలు చేసిన పిటిషన్‌‌ను ఢిల్లీ హైకోర్టు విచారించి, సంచలన ఆదేశాలను జారీ చేసింది. తనపై రూపొందించిన చిత్రంలో ముఖ కవళికలు, స్వరం వంటి వన్నీ డీఫ్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించారని, తనపై చేసిన ఏఐ వీడియోతో పాటు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రమ్, ఫేస్ బుక్, ఎక్స్‌లలో పెద్ద సంఖ్యలో తన పేరుపై ఉన్న నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలగించాలని అకీరా నందన్ తన పిటిషన్‌లో కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ప్రతివాదులకు షాకిస్తూ, నోటీసులు జారీ చేసింది. అలాగే అకీరాపై చేసిన ఏఐ లవ్ స్టోరీ పిక్చర్‌పై కూడా నిషేధం విధించింది. ఏఐ, డీప్‌ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అకీరా నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం దోపిడీ చేయడమేనని, అతని ప్రతిష్టకు భంగం కలిగించే వక్రీకరించిన కంటెంట్‌ను రూపొందించడం ద్వారా అతని గోప్యతా హక్కును ఉల్లంఘించినట్లవుతుందన్న హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తొలగించాలని, ఐపి వివరాలను బహిర్గతం చేయాలని మెటా, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రమ్, ఫేస్ బుక్, ఎక్స్ సంస్థలకు జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం నోటిసులు జారీ చేసింది.

Also Read- Chiranjeevi Movie: రికార్డ్ బ్రేక్ చేసిన ‘మన శంకరవరప్రసాద్ గారు’.. 15 రోజుల గ్రాస్ ఎంతంటే?

ఢిల్లీ హైకోర్టుకే ఎందుకు?

దీంతో అకీరా నందన్ అండ్ టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కోర్టులో అకీరా నందన్ తరపున సీనియర్ న్యాయవాది జె సాయి దీపక్ వాదనలు వినిపించగా.. గూగుల్ తరపున ఆదిత్యా గుప్తా, మెటా తరుపున న్యాయవాది వరుణ్ పాఠక్ వాదనలు వినిపించారు. అయితే సెలబ్రిటీలందరూ ఢిల్లీ హైకోర్టునే ఎందుకు ఆశ్రయిస్తున్నారనే అనుమానం అందరిలోనూ ఉంది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడానికి కారణం ఏమిటంటే.. సోషల్ మీడియా సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, యూట్యూబ్, ఎక్స్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖ కార్యాలయాలు ఢిల్లీలో ఉంటాయి. ఢిల్లీ కోర్టు ఇచ్చే ఉత్తర్వులు దేశవ్యాప్తంగా త్వరగా అమలు అవుతాయి. అందుకే సెలబ్రిటీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారని తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?