Anupama Parameswaran: తెలుగు సినిమా పరిశ్రమలో థ్రిల్లర్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన చోటుంది. అదే తరహాలో ‘కిష్కింధపురి’ రూపొందింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రదాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమతో కలసి ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అందులో ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా కట్టిపడేస్తుందో చెప్పుకొచ్చారు. తాజాగా జరిగిన ఓ ఇంటరాక్షన్ లో అనుపమ పరమేశ్వరన్ అభిమాని.. మీరు నా చిన్ననాటి క్రష్ అయితే టెల్లు స్క్వేర్ సినిమాలో మిమ్మల్ని చూసి నేను డైజెస్ట్ చేసుకోలేకపోయా.. ఎందుకు అలా చేశారు? అని ప్రశ్నించాడు. దానికి అనుపమ సమాధానం ఇస్తూ.. సరే మంచి సినిమాలలోనే నటిస్తాను. టిల్లు స్క్వేర్ చూశాను అంటున్నావు కదా మరి ‘పవదా’ సినిమాను ఎందుకు చూడలేదు అని ప్రశ్నించారు. మంచి సినిమాలు తీస్తే ఎవడూ చూడడు అంటూ చెప్పుకొచ్చారు. నేనే నీ క్రష్ అంటున్నావు కదా ముందుగా అందులోనుంచి నన్ను తీసేయ్ అంటూ చెప్పారు. సందేశం ఇచ్చే మంచి సినిమాలను ఎవరూ చూడరని తెలుస్తోంది.
Read also-GHMC Commissioner: జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు గుడ్ న్యూస్.. భీమా రూ. 30 లక్షలకు పెంపు
సినిమా కథాంశం ఒక పాత రేడియో స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఒక ఘోస్ట్ టూర్లో పాల్గొన్న సందర్శకులు ఈ పాత భవనంలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారు ఒక నిద్రాణ ఆత్మను డిస్టర్బ్ చేస్తారు. ఫలితంగా, వారు ఆ భవనంలో చిక్కుకుపోతారు అతిప్రాకృత శక్తులు వారి జీవితాలను ప్రతిఘటిస్తాయి. వారు బయటపడటానికి మార్గం వెతికాలి, ఇది భయానక సస్పెన్స్తో కూడిన ప్రయాణం. కథలో భయం, మిస్టరీ సర్వైవల్ ఎలిమెంట్స్ ముఖ్యమైనవి. ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను టెన్షన్లో ఉంచేలా రూపొందించబడింది. ఇది ఒక హారర్-థ్రిల్లర్గా, భారతీయ సినిమాలోని కొత్త ట్రెండ్లకు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా, పాత రేడియో స్టేషన్ సెట్టింగ్ భయాన్ని మరింత డీప్ చేస్తుంది.
Read also-Telusu Kada Teaser: సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా టీజర్ వచ్చేసింది.. చూడాలంటే ‘తెలుసు కదా’?
రామాయణంలోని కిష్కింధ కాండం నుంచి ప్రేరణ పొందిన ఈ టైటిల్, భయం, మిస్టరీ సస్పెన్స్తో కూడిన కథను సూచిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి, ఇది అతని తొలి ప్రాజెక్ట్లలో ఒకటి. ప్రొడ్యూసర్ సాహు గరపతి, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే టీజర్, ఫస్ట్ గ్లింప్స్ విడుదలై, సోషల్ మీడియాలో భారీ బజ్ రేపాయి. సినిమా టైటిల్ ‘కిష్కింధపురి’ రామాయణంలోని వానరుల రాజ్యాన్ని గుర్తుచేస్తుంది. కానీ, కథ ఆ ఎపిక్తో సరిగ్గా సంబంధం లేకపోవచ్చు, బదులుగా భయానక అంశాలతో ముడిపడి ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైన వరల్డ్ను సృష్టించి, ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. థ్రిలర్ చిత్రాలు ఇష్టపడేవారు ఈ సినిమా విడుదల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.