Srinuvas Reddy | కోళ్ల పందేలతో సంబంధం లేదు : శ్రీనివాస్ రెడ్డి
Srinuvas Reddy
Telangana News

Srinuvas Reddy | ఫామ్ హౌస్ కోళ్ల పందేలతో నాకు సంబంధం లేదు : పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

Srinuvas Reddy | మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో జరిగిన కోళ్ల పందేలతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అక్కడ జరిగిన ఘటన తనకు తెలియకుండానే జరిగిందన్నారు. ఘటన జరిగిన రోజు తాను అసలు హైదరాబాద్ లోనే లేనని.. వరంగల్ లోని ఎల్లమ్మ పండగ వద్ద ఉన్నట్టు చెప్పారు. మొయినాబాద్ లోని తొల్కట్టలో తాను 2018లోనే భూమిని కొన్నానని.. దాన్ని తన మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి చూసుకుంటున్నాడంటూ ఆయన వివరించారు.

అక్కడ ఫామ్ హౌజ్ లేదని.. కొబ్బరితోట, మామిడితోట, పనివాళ్ల కోసం రెండు గదులు మాత్రమే ఉన్నాయన్నారు. జ్ఞానదేవ్ తనకు తెలియకుండా ఆ భూమిని వర్రా రమేశ్ రెడ్డికి కౌలుకు ఇచ్చినట్టు నిన్ననే తెలిసిందన్నారు. వర్రా రమేశ్ కూడా ఆ భూమిని ఎం.వెంకటపతిరాజుకు కౌలుకు ఇచ్చినట్టు ఈ ఘటనతోనే తెలిసిందన్నారు. కాబట్టి అక్కడ జరిగిన ఆ ఘటన తన ప్రమేయంతో జరగలేదని ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటివి తనపై బురదజల్లేందుకు చేస్తున్నారని ఆరోపించారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?