Srinuvas Reddy
తెలంగాణ

Srinuvas Reddy | ఫామ్ హౌస్ కోళ్ల పందేలతో నాకు సంబంధం లేదు : పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి

Srinuvas Reddy | మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో జరిగిన కోళ్ల పందేలతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అక్కడ జరిగిన ఘటన తనకు తెలియకుండానే జరిగిందన్నారు. ఘటన జరిగిన రోజు తాను అసలు హైదరాబాద్ లోనే లేనని.. వరంగల్ లోని ఎల్లమ్మ పండగ వద్ద ఉన్నట్టు చెప్పారు. మొయినాబాద్ లోని తొల్కట్టలో తాను 2018లోనే భూమిని కొన్నానని.. దాన్ని తన మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి చూసుకుంటున్నాడంటూ ఆయన వివరించారు.

అక్కడ ఫామ్ హౌజ్ లేదని.. కొబ్బరితోట, మామిడితోట, పనివాళ్ల కోసం రెండు గదులు మాత్రమే ఉన్నాయన్నారు. జ్ఞానదేవ్ తనకు తెలియకుండా ఆ భూమిని వర్రా రమేశ్ రెడ్డికి కౌలుకు ఇచ్చినట్టు నిన్ననే తెలిసిందన్నారు. వర్రా రమేశ్ కూడా ఆ భూమిని ఎం.వెంకటపతిరాజుకు కౌలుకు ఇచ్చినట్టు ఈ ఘటనతోనే తెలిసిందన్నారు. కాబట్టి అక్కడ జరిగిన ఆ ఘటన తన ప్రమేయంతో జరగలేదని ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటివి తనపై బురదజల్లేందుకు చేస్తున్నారని ఆరోపించారు.

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు