Revanth Reddy
తెలంగాణ, హైదరాబాద్

Revanth Reddy | మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..!

Revanth Reddy | హైదరాబాద్ లో ప్రముఖ మైక్రోసాఫ్ట్ కంపెనీ కొత్త క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఐటీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి రేవంత్ రెడ్డి (Revanth Reddy)  పాల్గొన్నారు. మైక్రోసాఫ్ కంపెనీతో హైదరాబాద్ కు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీలు చాలానే ఉన్నాయని.. ఇప్పుడు ఇంత పెద్ద ఆఫీస్ ఏర్పాటు చేయడం హైదరాబాద్ కు గర్వకారణం అన్నారు.

దావోస్ లో ఒప్పందం చేసుకున్నందున.. ఇది సాధ్యం అయిందన్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ లో చాలా పెట్టుబడులు పెడుతోందని.. ఈ కొత్త క్యాంపస్ ద్వారా 4వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. తాము దావోస్ లో ఒప్పందం చేసుకున్న చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు సీఎం. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉపాధి లభించే విధంగా తాము కృషి చేస్తున్నామని వివరించారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు