telangana high court
తెలంగాణ

Telangana High Court | హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు ముగ్గురు జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం అదనపు జడ్జీలుగా ఉన్న వీరిని పర్మినెంట్ జడ్జీలుగా నియమించాలని బుధవారం జరిగిన సమావేశంలో కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్, జస్టిస్ కళాసికం సుజన అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. వీరిని పర్మినెంట్ జడ్జీలుగా ఎలివేట్ చేయాలని కొలీజియం నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తెలపగానే వీరు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవలే నలుగురు జ్యుడిషియల్ అధికారులను రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కొలీజియం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది. దీంతో ముగ్గురు అదనపు జడ్జీలు పర్మినెంట్ జడ్జీలయ్యేందుకు మార్గం సుగమమైంది.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?