Telangana High Court | హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు
telangana high court
Telangana News

Telangana High Court | హైకోర్టుకు ముగ్గురు జడ్జీలు

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: తెలంగాణ హైకోర్టు (Telangana High Court)కు ముగ్గురు జడ్జీలను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం అదనపు జడ్జీలుగా ఉన్న వీరిని పర్మినెంట్ జడ్జీలుగా నియమించాలని బుధవారం జరిగిన సమావేశంలో కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ, జస్టిస్ జూకంటి అనిల్ కుమార్, జస్టిస్ కళాసికం సుజన అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. వీరిని పర్మినెంట్ జడ్జీలుగా ఎలివేట్ చేయాలని కొలీజియం నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తెలపగానే వీరు బాధ్యతలు తీసుకోనున్నారు. ఇటీవలే నలుగురు జ్యుడిషియల్ అధికారులను రాష్ట్ర హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కొలీజియం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది. దీంతో ముగ్గురు అదనపు జడ్జీలు పర్మినెంట్ జడ్జీలయ్యేందుకు మార్గం సుగమమైంది.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క