Betting Apps Case: బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వానికి సీఐడీ నివేదిక
Betting Apps Case ( image credit: swetcha reporter)
Telangana News

Betting Apps Case: బెట్టింగ్ యాప్‌లపై ప్రభుత్వానికి సీఐడీ నివేదిక సిద్ధం.. ఈ కేసులో తదుపరి అడుగు ఏంటి?

Betting Apps Case: బెట్టింగ్ యాప్​ ల కేసులో సీఐడీ విచారణ పూర్తయ్యింది. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటివరకు దర్యాప్తులో వెల్లడైన వివరాలతో త్వరలోనే తుది నివేదికను రూపొందించనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఫైనల్​ రిపోర్టులో ఏముంటుందో అన్న టెన్షన్ యాప్ లను ప్రమోట్ చేసిన వారిలో వ్యక్తమవుతోంది. కాగా, సిట్ అధికారులు మంగళవారం ఈ కేసులో నిందితులుగా ఉన్న టాలీవుడ్​, బుల్లితెర నటీమణులు మంచు లక్ష్మి, రీతూచౌదరిలతోపాటు యూ ట్యూబర్​ భయ్యా సన్నీ యాదవ్​ ను మరోసారి విచారించారు.

కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు

పలువురి ఆత్మహత్యలకు కారణమవటంతోపాటు ఎన్నో కుటుంబాలను కోలుకోలేని దెబ్బ తీసిన బెట్టింగ్ యాప్​ లపై మొదట్లో పంజగుట్ట, మియాపూర్​ పోలీస్​ స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ తరువాత వీటిని సీఐడీకి అప్పగించారు. సీఐడీ ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేశారు. ఇక, నిందితులుగా టాలీవుడ్​, బుల్లితెర నటీనటులను సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించారు.

Also Read: Betting Apps Case: బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరైన మంచు లక్ష్మీ ప్రసన్న

ఎంత రెమ్యునరేషన్​ తీసుకున్నారు?

ఏయే యాప్ లను ప్రమోట్ చేశారు? ఎంత రెమ్యునరేషన్​ తీసుకున్నారు? నగదు చెల్లింపులు ఎలా జరిగాయి? అన్న సమాచారాన్ని తీసుకున్నారు. దాంతోపాటు బ్యాంక్​ అకౌంట్లు, లావాదేవీల సమాచారాన్ని కూడా సేకరించారు. తాజాగా మరోసారి మంచు లక్ష్మి, రీతూ చౌదరి, భయ్యా సన్నీయాదవ్ లను సీఐడీ కార్యాలయానికి పిలిపించి రెండు గంటలకు పైగా ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో విచారణ ముగిసినట్టే అని అధికారుల ద్వారా తెలిసింది. త్వరలోనే ఫైనల్​ రిపోర్ట్ తయారు చేసి కోర్టుకు సమర్పించనున్నట్టు సమాచారం.

టెన్షన్​ టెన్షన్​

తుది నివేదికను తయారు చేసి కోర్టుకు సమర్పించనున్న నేపథ్యంలో బెట్టింగ్​ యాప్​ ల కేసులో నిందితులుగా ఉన్న సెలబ్రెటీల్లో కలవరం వ్యక్తమవుతోంది. ఇటీవల ఎన్​ ఫోర్స్​ మెంట్ డైరెక్టరేట్ అధికారులు బెట్టింగ్​ యాప్​ ల కేసులోనే క్రికెటర్లు యువరాజ్​ సింగ్, రాబిన్​ ఊతప్పతోపాటు బాలీవుడ్​ నటులు సోనూ సూద్​, నేహా శర్మ, ఊర్వశీ రౌతేలా తల్లితోపాటు టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుశ్ హజ్రాలకు చెందిన 7.93 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను తాత్కాలికంగా అటాచ్​ చేసింది. సీఐడీలో నమోదైన బెట్టింగ్ యాప్​ లకు సంబంధించిన కేసు ఎఫ్​ఐఆర్​ ఆధారంగా ఇక్కడ కూడా ఎన్​ ఫోర్స్​ మెంట్ డైరెక్టరేట్​ అధికారులు ఈసీఐఆర్​ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటీనటులను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారణ కూడా చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ కూడా ఈడీ అధికారులు ఆస్తులను అటాచ్​ చేస్తారా? అన్న సస్పెన్స్ నెలకొంది. ​

Also Read: Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. రానా, మంచు లక్ష్మికి పిలుపు

Just In

01

AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AV Ranganath: పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి.. అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్.. ఆధారాలతో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!

Vivek Venkatswamy: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి!

Anasuya: అతనిది చేతగానితనం.. శివాజీకి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్