Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు-ఫిల్మ్ మేకర్ పలాష్ ముచ్చల్ల పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కార్డు త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని సూచిస్తుంది. అయితే ఇది నకిలీదా లేక నిజమైనదా అనే దానిపై అభిమానుల్లోనూ, మీడియాలోనూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల, ఒక కార్యక్రమంలో పలాష్ ముచ్చల్ మాట్లాడుతూ, స్మృతి మంధాన “త్వరలో ఇండోర్ కోడలు కాబోతోంది” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఒక్క వ్యాఖ్య వారి పెళ్లిపై చర్చను మరింత పెంచింది. ఇప్పటికే వీరిపై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది నిజమో కాదో తెలుసుకోవాలి అంతే ఆగాల్సిందే.
Read also-Globe Trotter event: ‘SSMB29’ ఈవెంట్ లోకేషన్ డ్రోన్ విజువల్ చూశారా.. పిచ్చెక్కుతుంది భయ్యా..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రికలో, స్మృతి, పలాష్ల వివాహం త్వరలో జరగనుందని ఉంది. కొందరు అభిమానులు ఈ కార్డును షేర్ చేస్తూ, వివాహ తేదీ నవంబర్ 20 అని, వేదిక మహారాష్ట్రలోని వారి స్వస్థలంలో అని పేర్కొన్నారు. ఈ కార్డులో వారి తల్లిదండ్రులు తాతామామల పేర్లు సరిగ్గా ఉన్నాయని కూడా కొందరు గమనించారు. అయితే, ఈ వెడ్డింగ్ కార్డు నిజమైనదా కాదా అనేది ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు మరియు ఫ్యాక్ట్-చెకర్లు ఈ కార్డు డిజిటల్గా మార్చబడినట్లు లేదా ఫోటోషాప్ చేయబడినట్లు కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. దీనిపై స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ కుటుంబ సభ్యులు ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు.
Read also-Akhanda 2: బాలయ్య ‘అఖండ 2’ తాండవం సాంగ్ వచ్చేసింది.. ఏం కొట్టాడు భయ్యా థమన్..
ఈ ఊహాగానాల మధ్యే, స్మృతి మంధాన 2025లో జరిగే మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL)లో ఆడటం లేదు. ఆమె ఈ టోర్నమెంట్కు దూరంగా ఉండటానికి ఆమె పెళ్లి కూడా ఒక కారణం కావచ్చని కొందరు అభిమానులు అనుకుంటున్నారు. కానీ దీనిపై కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ల వివాహం గురించి వార్తలు వస్తున్నప్పటికీ, వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డు విశ్వసనీయతపై అనుమానాలు ఉన్నాయి. ఈ జంట లేదా వారి కుటుంబం ఒక అధికారిక ప్రకటన చేసే వరకు, ఈ వార్తలను కేవలం ఊహాగానాలుగానే పరిగణించాలి.
