Uttam Kumar Reddy (imagecredit:swetcha)
తెలంగాణ

Uttam Kumar Reddy: తక్కువ వ్యయంతో ప్రాణహిత చేవెళ్ల పునరుద్దరణకు ప్రభుత్వం కసరత్తు

Uttam Kumar Reddy: ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు‌ని తక్కువ వ్యయంతో పునరుద్ధరించేలా తమ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తెలిపారు. సోమవారం సచివాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, సుందిళ్ల లింక్ ద్వారా కొత్త అలైన్‌మెంట్‌తో 10 నుంచి 12 శాతం వ్యయం తగ్గే అవకాశం ఉందన్నారు. భూసేకరణ సగం మేరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. సుమారు రూ.1,500 నుంచి 1,600 కోట్లు ఆదా అవుతుందని, కొత్త అలైన్‌మెంట్ సాంకేతికంగా, బలంగా ఉండేలా రూపకల్పన చేస్తున్నామన్నారు. నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణతో సమతౌల్యంగా ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పనపై దృష్టి పెట్టామన్నారు. తక్కువ పొడవు ఉన్న కాలువలు, టన్నెళ్లతో నిర్మాణ వ్యయం తగ్గనుందని వివరించారు.

పర్యావరణ సర్వేలు

పంప్ హౌస్‌ల సంఖ్య 15 నుంచి 10కి తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్క పంప్‌హౌస్‌ 30 మెగావాట్ల సామర్థ్యం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగం తగ్గి, నిర్వహణ సులభతరం కానున్నదన్నారు. సుందిళ్ల లింక్ ద్వారా ప్రాజెక్టు పర్యావరణపరంగా సానుకూల మార్గంలో ముందుకెళ్లనుందని వెల్లడించారు. కొత్త డీపీఆర్(DPR) కోసం భౌగోళిక, సాంకేతిక, పర్యావరణ సర్వేలు మళ్లీ ప్రారంభిస్తామన్నారు. ఈ డీపీఆర్ పూర్తయ్యాక రాష్ట్ర క్యాబినెట్‌ ముందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రణాళిక తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలు జరుపుతామని తెలిపారు. ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టు ద్వారా12 లక్షల ఎకరాలకు సాగునీటిని, హైదరాబాద్‌కి తాగునీటిని సరఫరా చేయడమే తమ లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారు.

Also Read: Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

పెండింగ్​ ప్రాజెక్టును పునర్నిర్మించడమే ఉద్దేశం

తెలంగాణ(Telangana)లోని ఎత్తైన ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకురావాలనే అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంతో పాటు, సాంకేతిక దృఢత్వం, ఆర్థిక వివేకం, పర్యావరణ బాధ్యతను నిర్ధారించే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పునర్నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ(Tummidihatti Barrage) వద్ద ప్రాణహిత నది నుండి నీటిని తీసుకొని 71 కిలోమీటర్ల కాలువ వ్యవస్థ ద్వారా ఎల్లంపల్లి బ్యారేజీకి తీసుకెళ్లాలని, అయితే, అలైన్‌మెంట్ వెంట బొగ్గు అతుకులు గుర్తించినప్పుడు ప్రాజెక్ట్ ప్రధాన అడ్డంకులను ఎదుర్కొంటుందని, ఇది సొరంగం తవ్వకాన్ని ప్రమాదకరంగా, ఖరీదై నదిగా ఉందన్నారు. వివరణాత్మక డీపీఆర్, గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంకా జరుగుతున్నదన్నారు. తెలంగాణ కాలువ వ్యవస్థలోకి తగినంత నీటి ప్రవాహానికి సరైన స్థాయిని నిర్వహించడం చాలా అవసరం అన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని వెల్లడించారు.

Also Read: Cobra Snake Video: ఏకంగా పాముతో లిప్ కిస్.. వీడెంటి బాబోయ్ ఇలా చేస్తున్నాడు? వీడియో వైరల్

Just In

01

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?