Uttam Kumar Reddy: తక్కువ వ్యయంతో ప్రాజెక్టుల పునరుద్దరణ
Uttam Kumar Reddy (imagecredit:swetcha)
Telangana News

Uttam Kumar Reddy: తక్కువ వ్యయంతో ప్రాణహిత చేవెళ్ల పునరుద్దరణకు ప్రభుత్వం కసరత్తు

Uttam Kumar Reddy: ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు‌ని తక్కువ వ్యయంతో పునరుద్ధరించేలా తమ ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తెలిపారు. సోమవారం సచివాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, సుందిళ్ల లింక్ ద్వారా కొత్త అలైన్‌మెంట్‌తో 10 నుంచి 12 శాతం వ్యయం తగ్గే అవకాశం ఉందన్నారు. భూసేకరణ సగం మేరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. సుమారు రూ.1,500 నుంచి 1,600 కోట్లు ఆదా అవుతుందని, కొత్త అలైన్‌మెంట్ సాంకేతికంగా, బలంగా ఉండేలా రూపకల్పన చేస్తున్నామన్నారు. నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణతో సమతౌల్యంగా ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టు రూపకల్పనపై దృష్టి పెట్టామన్నారు. తక్కువ పొడవు ఉన్న కాలువలు, టన్నెళ్లతో నిర్మాణ వ్యయం తగ్గనుందని వివరించారు.

పర్యావరణ సర్వేలు

పంప్ హౌస్‌ల సంఖ్య 15 నుంచి 10కి తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్క పంప్‌హౌస్‌ 30 మెగావాట్ల సామర్థ్యం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగం తగ్గి, నిర్వహణ సులభతరం కానున్నదన్నారు. సుందిళ్ల లింక్ ద్వారా ప్రాజెక్టు పర్యావరణపరంగా సానుకూల మార్గంలో ముందుకెళ్లనుందని వెల్లడించారు. కొత్త డీపీఆర్(DPR) కోసం భౌగోళిక, సాంకేతిక, పర్యావరణ సర్వేలు మళ్లీ ప్రారంభిస్తామన్నారు. ఈ డీపీఆర్ పూర్తయ్యాక రాష్ట్ర క్యాబినెట్‌ ముందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రణాళిక తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తుపై మహారాష్ట్రతో చర్చలు జరుపుతామని తెలిపారు. ప్రాణహితచేవెళ్ల ప్రాజెక్టు ద్వారా12 లక్షల ఎకరాలకు సాగునీటిని, హైదరాబాద్‌కి తాగునీటిని సరఫరా చేయడమే తమ లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారు.

Also Read: Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

పెండింగ్​ ప్రాజెక్టును పునర్నిర్మించడమే ఉద్దేశం

తెలంగాణ(Telangana)లోని ఎత్తైన ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకురావాలనే అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంతో పాటు, సాంకేతిక దృఢత్వం, ఆర్థిక వివేకం, పర్యావరణ బాధ్యతను నిర్ధారించే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పునర్నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ(Tummidihatti Barrage) వద్ద ప్రాణహిత నది నుండి నీటిని తీసుకొని 71 కిలోమీటర్ల కాలువ వ్యవస్థ ద్వారా ఎల్లంపల్లి బ్యారేజీకి తీసుకెళ్లాలని, అయితే, అలైన్‌మెంట్ వెంట బొగ్గు అతుకులు గుర్తించినప్పుడు ప్రాజెక్ట్ ప్రధాన అడ్డంకులను ఎదుర్కొంటుందని, ఇది సొరంగం తవ్వకాన్ని ప్రమాదకరంగా, ఖరీదై నదిగా ఉందన్నారు. వివరణాత్మక డీపీఆర్, గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంకా జరుగుతున్నదన్నారు. తెలంగాణ కాలువ వ్యవస్థలోకి తగినంత నీటి ప్రవాహానికి సరైన స్థాయిని నిర్వహించడం చాలా అవసరం అన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని వెల్లడించారు.

Also Read: Cobra Snake Video: ఏకంగా పాముతో లిప్ కిస్.. వీడెంటి బాబోయ్ ఇలా చేస్తున్నాడు? వీడియో వైరల్

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!