TG ( Image source: Twitter)
తెలంగాణ

Mana Ooru Mana Badi: కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయాలి.. సీఎంకు గుత్తా లేఖ

Mana Ooru Mana Badi: సీఎం రేవంత్ రెడ్డికి శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గురువారం లేఖ రాశారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయాలని లేఖలో కోరారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో మన ఊరు- మన బడి కింద సివిల్ పనులు పూర్తయ్యాయని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు సైతం ధృవీకరించారని తెలిపారు.

Also Read: Fisheries Department: మేడ్చల్‌లో రూ.5.85 కోట్లతో భవనాల నిర్మాణం.. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు!

సివిల్ పనులకు పెండింగ్ బిల్లులు రూ.361.350 కోట్లు ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేసి చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని కోరారు. చిన్న కాంట్రాక్టర్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల (స్కూల్ పేరెంట్స్ కమిటీ) అవసరాలను తీర్చడం ప్రభుత్వ బాధ్యతని లేఖలో పేర్కొన్నారు. రుణాలు తీసుకుని ఈ పనులను పూర్తి చేశారని, బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అసలు కంటే మిత్తి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.361.350 కోట్ల పెండింగ్ బిల్లులను అత్యంత ప్రాధాన్యతతో క్లియర్ చేయాలని సీఎంను గుత్తా కోరారు.

Also Read: Telangana Jagruti Presidents: 11 జిల్లాలకు జాగృతి జిల్లా అధ్యక్షుల నియామకం.. ప్రాధాన్యం ఎవరికంటే?

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?