Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా వచ్చిన నలుగురు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, వాకిటి రామకృష్ణారెడ్డి,(Ramakrishna Reddy)చలపతిరావు, గౌస్ మొహుద్దీన్ ప్రమాణం చేశారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణం చేయించారు.
Also Read: Meenakshi Seshadri: స్లీవ్లెస్ గౌనులో.. ‘ఆపద్భాంధవుడు’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
జూలై 28న ఆమోదం
ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు(High Court) న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. హైకోర్టు(High Court)లో లాయర్లుగా ఉన్న ఈ నలుగురిని కొత్త న్యాయమూర్తులుగా నియమించడానికి కేంద్ర ప్రభుత్వం గతంలోనే అంగీకరించింది. సుప్రీం కోలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 28న ఆమోదం తెలిపారు. ఈ నియామకాలతో తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. కాగా, నియమకాలతో కేసుల పరిష్కార వేగాన్ని పెంచడానికి, ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించడానికి దోహదపడుతుంది.
Also Read: Vijay Deverakonda: ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అంటుంటే.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది..