Warangal: వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోలు గ్రామంలో 11 కేవీ విద్యుత్ తెగిపడి గొర్రెల దొడ్డి పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటన లో గ్రామానికి చెందిన నూకల లక్ష్మీ కి చెందిన 18 సూడి పెద్ద గొర్రెలు, గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున పలు ఇండ్ల మీదుగా వెళ్లిన 11 కేవీ విద్యుత్ తీగ ఇన్సూరెటర్ ఫెయిల్ కావడంతో విద్యుత్ తీగ తెగిపడి గొర్రెల దొడ్డి, గొర్రెలు షార్ట్ సర్క్యూట్ తో పూర్తి దగ్ధం అయ్యాయి. దీనితో 18 సూడు గొర్రెలు, గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి.
Also Read: Soothravakyam: వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో పోలీస్గా నటించిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
20 గొర్రెలు అస్వస్థతకు గురి అయ్యాయి.దొడ్డి పూర్తిగా దగ్ధం అయింది. మొత్తంగా నాలుగు లక్షల ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరింది. దీనితో పాటుగా గ్రామంలో ఇండ్ల మీదుగా ఉన్న 11 కేవీ లైన్ ను తొలిగించి, గ్రామ మధ్యలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ తొలిగించాలని కోరారు.ఇప్పటికే పలువురి పశువులు, మూగజీవాలు, మనుషులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Venu Swamy: నా దగ్గరికి వారు కూడా వస్తారు.. సంచలన విషయాలు బయట పెట్టిన వేణు స్వామి!