Warangal: షార్ట్ సర్క్యూట్‌తో గొర్రెల దొడ్డి దగ్ధం..
Warangal ( Image Source: Twitter)
Telangana News

Warangal: షార్ట్ సర్క్యూట్‌తో మంటలు.. 18 గొర్రెల మృతి

Warangal: వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్దకొర్పోలు గ్రామంలో 11 కేవీ విద్యుత్ తెగిపడి గొర్రెల దొడ్డి పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటన లో గ్రామానికి చెందిన నూకల లక్ష్మీ కి చెందిన 18 సూడి పెద్ద గొర్రెలు, గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. ఈ సందర్భంగా లక్ష్మీ మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున పలు ఇండ్ల మీదుగా వెళ్లిన 11 కేవీ విద్యుత్ తీగ ఇన్సూరెటర్ ఫెయిల్ కావడంతో విద్యుత్ తీగ తెగిపడి గొర్రెల దొడ్డి, గొర్రెలు షార్ట్ సర్క్యూట్ తో పూర్తి దగ్ధం అయ్యాయి. దీనితో 18 సూడు గొర్రెలు, గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి.

Also Read: Soothravakyam: వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో పోలీస్‌గా నటించిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

20 గొర్రెలు అస్వస్థతకు గురి అయ్యాయి.దొడ్డి పూర్తిగా దగ్ధం అయింది. మొత్తంగా నాలుగు లక్షల ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరింది. దీనితో పాటుగా గ్రామంలో ఇండ్ల మీదుగా ఉన్న 11 కేవీ లైన్ ను తొలిగించి, గ్రామ మధ్యలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ తొలిగించాలని కోరారు.ఇప్పటికే పలువురి పశువులు, మూగజీవాలు, మనుషులు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Venu Swamy: నా దగ్గరికి వారు కూడా వస్తారు.. సంచలన విషయాలు బయట పెట్టిన వేణు స్వామి!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?