America: అమెరికాలో ఘోరం.. తెలుగు ఫ్యామిలీ సజీవ దహనం
America Road Accident
Telangana News, లేటెస్ట్ న్యూస్

America: అమెరికాలో ఘోరాతి ఘోరం.. హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం

America: అమెరికాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకున్నది. సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన కుటుంబం (Hyderabad Family) సజీవ దహనమైంది. వెకేషన్ కోసం ఈ మధ్యనే ఆ కుటుంబం డల్లాస్‌కు వెళ్లింది. అయితే ఊహించని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో తేజస్విని, శ్రీ వెంకట్, దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. సెలవులు ఉండటంతో అట్లాంటలోని బంధువుల ఇంటికి వెంకట్ తన కుటుంబంతో కలిసి కారులో వెళ్ళారు. వారం రోజుల పాటు అట్లాంటలో ఎంజాయ్ చేశారు. అయితే డల్లాన్ (Dallas) నుంచి అర్ధరాత్రి తిరిగొస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. గ్రీన్ కౌంటి ఏరియాలో రాంగ్ రూట్‌లో వచ్చిన కారును మినీ ట్రక్ ఢీ కొన్నది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనమయ్యారు.

Read Also- Atchannaidu: ఢిల్లీ వేదికగా వైఎస్ జగన్‌ గాలి తీసిన అచ్చెన్న..!

America Accident

ఎముకలు మిగిలాయ్!
మంటల థాటికి కారు మొత్తం బూడిద అయిపోయింది. మనుషుల ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో ఎముకలను సేకరించిన పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపారు. డీఎన్ఏ (DNA) శాంపిల్ తీసుకొని మృతి దేహాలను పోలీసులు అప్పగించనున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు.. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంకట్, తేజస్విని కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమకు సాయం చేయాలని వేడుకుంటున్నారు.

Just In

01

Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

Special Trains: ప్రయాణికులకు బిగ్ న్యూస్.. సంక్రాంతి పండుగకు ప్రత్యేక రైళ్లు ఇక బుకింగ్..!

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి