Cm Revanth Reddy (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Cm Revanth Reddy: బీఆర్ఎస్ గొర్రెలు, బర్రెలు ఇస్తే.. మేం ఉద్యోగాలిచ్చాం.. సీఎం రేవంత్

Cm Revanth Reddy: ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం అనంతరం మాట్లాడారు. ఇవాళ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలుగు యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని అన్నారు.

చదువుతోనే గుర్తింపు
జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదన్న ఆయన.. మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనత భావాన్ని వీడాలని పిలుపునిచ్చారు. వారిలో ఆత్మన్యూనత భావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఆ ఘనత కాంగ్రెస్‌దే!
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని వారు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది వాస్తవం కాదా? అంటూ నిలదీశారు. కానీ తాము మొదటి ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని సీఎం అన్నారు. మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

ఎదురుపడితే ప్రశ్నించాలి
గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ నోటికాడి కూడును కిందపడేసినట్లు.. రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో గ్రూప్-1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతోందని అన్నారు. వాళ్లింట్లో ఎన్నికల్లో ఓడిపోతే 6 నెలలు తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారని చెప్పారు. కానీ మీకు మాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అలాంటి వారు మీకు ఎదురైతే ప్రశ్నించాలని అన్నారు.

ఉస్మానియా చరిత్రలో తొలిసారి
తొలి పాతికేళ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే మీరు మీ జీవితాల్లో రాణిస్తారని సీఎం సూచించారు. తప్పుదారి పడితే కన్న తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుందని అన్నారు. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ తెచ్చుకోవద్దని హితవు పలికారు. ‘కష్టపడండి… సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో రాణించి తల్లిదండ్రులకే కాదు.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలి’ అని సీఎం కోరారు. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని నియమించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించామని చెప్పారు.

Also Read: CM Chandrababu Warning: చంద్రబాబు ఉగ్రరూపం.. వారికి అదే చివరి రోజు.. పెద్ద వార్నింగే!

తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు
అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వీళ్లందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రాలేదని సీఎం అన్నారు. బాగా చదువుకున్నారు కాబట్టే వారికి గుర్తింపు వచ్చిందని చెప్పారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని.. అన్ని రంగాల్లో మీరు రాణించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం పేర్కొన్నారు.

Also Read This: Kamal Haasan: కమల్ హాసన్‌‌కు సూపర్ ఛాన్స్.. సీఎం సపోర్ట్‌తో ఎంపీగా ఖరారు!

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ