Godavari River Management: తమ అధికారులపై గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వివక్ష చూపిస్తుందని తెలంగాణ ఆరోపించింది. ఎక్స్ టెన్షన్ ఇవ్వకుండా గోదావరి బోర్డు ఇబ్బందులకు గురి చేస్తుందని మండిపడ్డారు. కానీ ఏపీ ఉద్యోగులకు మాత్రం పెద్దపీట వేశారని ప్రశ్నించారు. అర్హత లేకున్నా ప్రమోషన్లను కల్పించడంపై తెలంగాణ ఫైర్ అయింది. ప్రస్తుతం బోర్డులో ఇన్చార్జి ఎస్ఈగా పనిచేస్తున్న ఏపీ అధికారి ఆర్. శ్రీకాంత్రెడ్డికి పూర్తి స్థాయి ఎస్ఈగా బాధ్యతలు అప్పగిస్తున్నట్టు బోర్డు మంగళవారం పేర్కొంది. బోర్డు రూల్స్ప్రకారం రెండేండ్ల పాటు ఇన్చార్జి ఎస్ఈగా పనిచేస్తేనే పూర్తి స్థాయి ఎస్ఈగా నియమించేందుకు అవకాశం ఉంటుంది.
కానీ పైన పేర్కొన్న అధికారి అనుభవం ప్రకారం అర్హత లేకున్నా సడలింపులు ఇస్తూ ఎస్ ఈ గా అవకాశం కల్పించినట్లు బోర్డు పేర్కొన్నది. అదేవిధంగా ఏపీ కేడర్డీఈఈ ఎం.వేణుగోపాల్అనే మరో అధికారికీ ఈఈగా బోర్డు అవకాశం కల్పించింది. ఇద్దరికీ అర్హత లేకపోయినా సడలింపులు ఇచ్చి మరీ ప్రమోషన్లు కల్పించిన బోర్డు మన అధికారుల విషయానికి వచ్చే సరికి మాత్రం కొర్రీలు పెడుతున్నది. సిబ్బంది కొరత దృష్ట్యా పలువురు అధికారుల డిప్యూటేషన్ను పెంచాలని ఈఎన్సీ లేఖ రాసినా బోర్డు కొట్టిపారేస్తూ నిబంధనలకు విరుద్ధమంటూ పేర్కొనడం గమనార్హం.
Also Read: Kalvakuntla Kavitha: కవితతో ఎంపీ దామోదర్ కీలక భేటీ.. కొత్త పార్టీని ఆపేందుకేనా?
ఇక బోర్డు మెంబర్ సెక్రటరీ అళగేశన్పై వచ్చిన ఆరోపణల మీద విచారణ చేయించేందుకు కృష్ణా బోర్డు సభ్యులు చైర్మన్గా ఓ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ కోరినా వినిపించుకోలేదు. తెలంగాణ తరఫున మెంబర్గా ఉన్న ఈఎన్సీ జనరల్అనిల్కుమార్ప్రతిపాదనలను బోర్డు కొట్టి పరేసింది. గోదావరి బోర్డులో ఇతర సభ్యులతో కమిటీని వేయలేమని జీఆర్ ఎంబీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏప్రిల్7న నిర్వహించిన 17వ బోర్డు మీటింగ్కు సంబంధించిన మీటింగ్మినిట్స్తుది నివేదికను తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం తెలంగాణ అధికారులు పేర్కొన్న ఎజెండా అంశాలను చర్చించేందుకు గోదావరి బోర్డు నిరాకరించినట్లు స్పష్టంమవుతున్నది.
బోర్డులో ఔట్సోర్సింగ్ఉద్యోగుల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిబంధనలే ఫాలో అవుతామని మినిట్స్లో గోదావరి బోర్డు చైర్మన్వెల్లడించారు. కనీస వేతనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగానే ఉద్యోగులను నియమిస్తామని ఏకపక్షంగా స్పష్టం చేశారు. ఇక గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు ఒక్కటేనని, దానిని ఇచ్చేందుకు అభ్యంతరం లేదని తెలంగాణ మినిట్స్ లో పేర్కొన్నదని బోర్డు వివరించింది.
అయితే, ఏపీ మాత్రం మన ప్రాజెక్టులపై మెలికలుపెట్టినట్టు మినిట్స్లో స్పష్టమైంది. ఏపీ ఎగువన తెలంగాణ ప్రాజెక్టులున్నాయని, వాటితో ఏపీపై ప్రభావం పడుతుందని ఏపీ పేర్కొన్నట్లు బోర్డు చైర్మన్ తెలిపారు. అన్ని పవర్ ప్రాజెక్టులూ ఏపీ భూభాగంలోనే ఉన్నాయని, తెలంగాణలో ఏమీ లేవని, కాబట్టి దీనిపై తెలంగాణకు ఏం సంబంధం లేదని మినిట్స్లో ఉన్నట్లు బోర్డు చైర్మన్ వివరించారు.
Also Read: Formula E Race Case: కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. బీఆర్ఎస్ స్ట్రాంగ్ రియాక్షన్!