Sravan Rao (imagecredit:twitter)
తెలంగాణ

Sravan Rao: శ్రవణ్ రావును విచారించిన సీసీఎస్​ పోలీసులు..!

Sravan Rao: ఛీటింగ్ కేసులో అరెస్టయిన శ్రవణ్​ రావును సీసీఎస్​ అధికారులు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. ముడి ఇనుప ఖనిజం డీల్​పేర మోసం చేసి వసూలు చేసిన 6.58 కోట్ల రూపాయలను ఏయే కంపెనీలకు మళ్లించారు? అన్నదానిపై ప్రశ్నించారు. టన్నుకు 300 రూపాయల లాభం వచ్చేలా చూస్తానని చెప్పి తమ కంపెనీ నుంచి 6.58 కోట్ల రూపాయలకు పైగా తీసుకుని శ్రవణ్​ రావు మోసం చేశాడంటూ ఇటీవల అఖండ ఇన్ఫ్రాటెక్​ కంపెనీ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ సీసీఎస్​పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫోన్​ట్యాపింగ్ కేసులో నిందితునిగా చేర్చగానే శ్రవణ్​రావు విదేశాలకు పారిపోయాడని ఆకర్ష్​కృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంప్రదించటానికి ఎన్నిమార్లు ప్రయత్నించినా శ్రవణ్ రావు అందుబాటులోకి రాలేదన్నారు. ఈ ఫిర్యాదు మేరకు సీసీఎస్​పోలీసులు శ్రవణ్​రావుతోపాటు అతని భార్య స్వాతి రావు, వ్యాపార భాగస్వాములు ఉమా మహేశ్వర్ రెడ్డి, వేదమూర్తిలపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 13న శ్రవణ్​ రావును అరెస్ట్​చేశారు. కాగా, ఈ కేసులో మరిన్ని అంశాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ శ్రవణ్​రావును అయిదు రోజులపాటు కస్టడీకి అనుమతించాలని ఇటీవల సీసీఎస్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఒక్క రోజు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సీసీఎస్​ అధికారుల బృందం చెంచల్​గూడ జైలుకు వెళ్లి శ్రవణ్​రావును కస్టడీకి తీసుకుంది. అనంతరం వైద్య పరీక్షలు జరిపించి సీసీఎస్ కు తీసుకొచ్చింది.

Also Read: KTR on CM Revanth: సీఎం రేవంత్‌కు ఆ వ్యాధి ఉంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

చెంచల్ గూడ జైలుకు తరలింపు

ఇనుప ముడి ఖనిజం డీల్ పేర ఆకర్ష్​ కృష్ణ నుంచి తీసుకున్న 6.58 కోట్ల రూపాయల విషయమై సీసీఎస్​ అధికారులు శ్రవణ్​ రావును ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఈ డబ్బును ఏదైనా కంపెనీలకు మళ్లించారా? అని అడిగినట్టు సమాచారం. శ్రవణ్​ రావుకు ఏయే బ్యాంకుల్లో ఖాతాలున్నాయి? అని అడగటంతోపాటు వాటి లావాదేవీల గురించి ప్రశ్నించినట్టు తెలిసింది. ఇక, ఈ వ్యవహారంలో స్వాతి రావు, ఉమా మహేశ్వర్​ రెడ్డి, వేదమూర్తిల పాత్ర గురించి అడిగినట్టు తెలియవచ్చింది.

కర్ణాటక సండూర్‌లో ఉన్న ఓ కంపెనీ పేర డబ్బు తీసుకున్న నేపథ్యంలో ఆ కంపెనీతో శ్రవణ్ రావుకు ఉన్న సంబంధంపై కూడా ఆరా తీసినట్టు సమాచారం. కాగా, శ్రవణ్​ రావు కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేదని తెలిసింది. కోర్టు ఇచ్చిన గడువు సాయంత్రానికి ముగియటంతో మరోసారి శ్రవణ్ రావుకు వైద్య పరీక్షలు జరిపించిన సీసీఎస్ అధికారులు ఆ తరువాత కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాలతో చెంచల్ గూడ జైలుకు తరలించారు. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్​ రావు భార్య స్వాతి రావు, ఉమా మహేశ్వర్ రెడ్డి, వేదమూర్తిల అరెస్టుకు సీసీఎస్​ అధికారులు రంగం సిద్ధం చేసినట్టుగా తెలియవచ్చింది.

Also Read: Kamal Haasan: ఇలాంటి సినిమా మళ్లీ మళ్లీ రాదు.. ఇది నా ప్రామిస్!

 

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్