Shrasti Verma : గత పది రోజుల నుంచి సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో ఈమె జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసి సెలబ్రిటీగా మారిపోయింది. ఈమె పెట్టిన కేసులో ఎంత నిజముందో తెలీదు. కానీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. అయితే, తాజాగా శ్రేష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. గుంటూరు జిల్లా SP కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం NSUI గుంటూరు జిల్లా నాయకులు ఆమె కేసు పెట్టారు. ఈ నేపథ్యంలోనే NSUI మెంబర్స్ ఆమెను అరెస్ట్ చేయాల్సిందే అంటూ ఆందోళన చేస్తున్నారు.
మహాత్మ గాంధీ తల్లిని, నెహ్రూ తల్లిని అసభ్యకరంగా తిట్టడమే కాకుండా.. ఇంకా ఇష్ట రాజ్యాంగ కూడా వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ పై పోస్ట్ కి కామెంట్ చేసింది. అంతే కాకుండా దానికి రిప్లై కౌంటర్ కూడా ఇచ్చింది. ఆమె చాలా ఈజీగా ఇట్స్ ఒకే బ్రో .. అంటూ కూల్ గా పెట్టింది.
ఆమె పెట్టిన కామెంట్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. చరిత్ర కలిగిన మహా యోధులు, సమర యోధులను కన్న తల్లి తండ్రులను అసభ్యకరంగా తిట్టడం తప్పు. FIR చేశారు కానీ, ఇంత వరకు శిక్ష వేయలేదు. కానీ, పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది. అతి త్వరలోనే శ్రేష్టి వర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపైన పోలీసు శాఖ వారు కఠినంగా శిక్ష వేస్తారనే న్యాయస్థానం పైన నమ్మకం ఉంది. దేశ వ్యాప్తంగా , పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు.