Wildlife Protection Act: జింక మాంసం కలిగి ఉన్న ముగ్గురిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు కిలోల జింక మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. టోలీచౌకీకి చెందిన హసన్ బక్రన్ (50) వ్యాపారి. అతని వద్ద జింక మాంసం ఉన్నట్టుగా సమాచారం అందటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో నిజామాబాద్ అహమద్ పురా కాలనీకి చెందిన తన స్నేహితుడు హమీద్ బిన్ హకానీ (54) నుంచి జింక మాంసాన్ని తీసుకున్నట్టుగా వెల్లడైంది. తీసుకున్న దాంట్లో నుంచి కొంత జింక మాంసాన్ని తన మరో మిత్రుడైన షేక్ అబ్దుల్ రహమాన్ (54)కు ఇచ్చినట్టు హసన్ బక్రన్ చెప్పాడు.
Also Read: Karregutta Mulugu Effects: ఆదివాసీల ఊచకోతలు.. మావోయిస్టుల హింస.. కర్రెగుట్టల వాస్తవ కథనం!
ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. హమీద్ బిన్ హకానీని ప్రశ్నించగా మహారాష్ట్రకు చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి నుంచి ఈ మాంసాన్ని కొన్నట్టుగా చెప్పాడు. అరెస్ట్ చేసిన ముగ్గురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం అటవీశాఖ అధికారులకు అప్పగించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు