తెలంగాణ: MLA Raja Singh: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో చెప్పులు విడిచే చోట పాకిస్తాన్ జెండా స్టిక్కర్లు అతికించారు. విషయం తెలిసిన మంగళ్ హాట్ పోలీసులు అక్కడికి వెళ్లి స్టిక్కర్లను తొలగించారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ లో మన జాతీయ జెండాలను తగులబెడుతున్నారని పేర్కొన్నారు.
నిజానికి పోలీసులు స్టిక్కర్లు తొలగించినపుడు రాజాసింగ్ తిరుమలలో ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కొండపై జెండా వివాదం మీద స్పందించారు. నా ఆఫీస్ లోకి వచ్చి వెళ్లేవారు పాకిస్తాన్ జెండాను తొక్కాలని గడపలో స్టిక్కర్లు అతికించినట్టు చెప్పారు. పోలీసులు వాటిని తొలగించారంటూ కార్యకర్తల ద్వారా తెలిసిందన్నారు.
Also Read: CM Revanth Reddy: నన్ను నమ్మండి.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు.. సీఎం రేవంత్
దీనిపై పోలీసులతో మాట్లాడగా అది ఓ మతానికి చెందిన జెండా అని చెప్పారన్నారు. పాకిస్తాన్ జెండాకు ఆ మతానికి చెందిన జెండాకు మధ్య ఉండే తేడా గురించి పోలీసులకు అవగాహన లేదన్నారు. ప్రధాని మోదీ ఉగ్రవాదులకు త్వరలోనే గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.