MLA Raja Singh (imagecredit:twitter)
తెలంగాణ

MLA Raja Singh: చెప్పులు విడిచే చోటు పాక్​ జెండా స్టిక్కర్.. ఎమ్మెల్యే​ వినూత్న నిరసన!

తెలంగాణ: MLA Raja Singh: పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ గోషామహల్​ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వినూత్న తరహాలో నిరసన వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో చెప్పులు విడిచే చోట పాకిస్తాన్ జెండా స్టిక్కర్లు అతికించారు. విషయం తెలిసిన మంగళ్​ హాట్​ పోలీసులు అక్కడికి వెళ్లి స్టిక్కర్లను తొలగించారు. దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్​ లో మన జాతీయ జెండాలను తగులబెడుతున్నారని పేర్కొన్నారు.

నిజానికి పోలీసులు స్టిక్కర్లు తొలగించినపుడు రాజాసింగ్​ తిరుమలలో ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కొండపై జెండా వివాదం మీద స్పందించారు. నా ఆఫీస్​ లోకి వచ్చి వెళ్లేవారు పాకిస్తాన్​ జెండాను తొక్కాలని గడపలో స్టిక్కర్లు అతికించినట్టు చెప్పారు. పోలీసులు వాటిని తొలగించారంటూ కార్యకర్తల ద్వారా తెలిసిందన్నారు.

Also Read: CM Revanth Reddy: నన్ను నమ్మండి.. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు.. సీఎం రేవంత్

దీనిపై పోలీసులతో మాట్లాడగా అది ఓ మతానికి చెందిన జెండా అని చెప్పారన్నారు. పాకిస్తాన్ జెండాకు ఆ మతానికి చెందిన జెండాకు మధ్య ఉండే తేడా గురించి పోలీసులకు అవగాహన లేదన్నారు. ప్రధాని మోదీ ఉగ్రవాదులకు త్వరలోనే గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?