Uppal Balu: ఉప్పల్ బాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్ నమస్తే షాక్ అయ్యారా అంటూ రోజుకొక వీడియోను షేర్ చేస్తుంటాడు. రీసెంట్ గా అఘోరి మీద వీడియోస్ చేస్తూ మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. మొదటి నుంచి తను ఎవరి మీద ఆధారపడకుండా తనకు తాను జీవనం కొనసాగిస్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే అవకాశం ఉన్నా.. అలా చేయకుండా వచ్చిన దానితోనే బతుకుతున్నాడు.
ఇప్పటికి పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. బెట్టింగ్ యాప్స్ ను ఎంకరేజ్ చేయను. ఎవరు జీవితాలతో ఆడుకోను. నేను కష్టపడి సంపాదించినా డబ్బు చాలు. దానితోనే మా కుటుంబాన్ని పోషించుకుంటాను అని చెప్పాడు. ఈ మాటలకు నెటిజన్స్ కూడా ఇంప్రెస్ అయ్యారు.
అంతే కాదు, నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ అతనికి ఐఫోన్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. ” ఉప్పల్ బాలు చూడటానికి అలా ఉంటాడు కానీ, తాను ఎప్పుడూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. ఇది నాకు బాగా నచ్చింది. అందుకే నా తరపున నుంచి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నా అంటూ ఫోన్ ను ఇచ్చాను ” అని వీడియోలో చెప్పాడు. అయితే, ఇదిలా ఉండగా ఉప్పల్ బాలు ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం, ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.
Also Read: Chiranjeevi: చంద్రబాబు ముందుచూపు వల్లే హైదరాబాద్ విశ్వ నగరమైంది.. చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
ఉప్పల్ బాలు (Uppal Balu) మాట్లాడుతూ ” ఇప్పుడు ఫేమస్ అయినా వాళ్ళందరూ నా వెనుక తిరిగే వాళ్ళు. నాకు టిఫిన్స్ మోసారు, వాటర్ బాటిల్స్ మోసారు. నా పక్కన నిలుచుని ఫోటో కూడా దిగారని” అని అన్నాడు . వారిలో ఒక్క పేరు చెప్పండి అని యాంకర్ అడగగా .. హ చెబుతాను .. నాకేమైనా భయమా అంటూ పల్లవి ప్రశాంత్ అని చెప్పాడు. వాడు నా బీర్లు తాగి మా ఆఫీసులో పడుకున్నాడు, వాడు ఎప్పుడూ నా వెనుకలే ఉండేవాడు .. కానీ, వీడియోస్ ఎప్పుడూ కనిపించడలేదు. వాడికి సంబందించిన ఫొటోస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తే వాడేమైనా తోపా ” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఈ విడియోపై రియాక్ట్ అయినా నెటిజన్స్ అబ్బా ఈ ఒక్క మాటతో పల్లవి ప్రశాంత్ పరువు మొత్తం పోయే, ఇప్పుడు మాట్లాడు రైతు బిడ్డా అని కొందరు అంటుండగా, ఉప్పల్ బాలు చెప్పింది నిజమే, ఏ స్టార్ హీరో అయిన యూట్యూబ్ లో ఎవ్వడు ఫేమస్ అయిన నీ తర్వాతనే ఉప్పల్ బాలు అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు