11 Died In Telangana (Image Source: Twitter)
తెలంగాణ

11 Died In Telangana: నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. 24 గంటల్లో 11 మంది మృతి!

11 Died In Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకూ అకస్మిక వర్షాలతో సేద తీరిన రాష్ట్ర ప్రజలు.. ప్రస్తుతం మండుటెండల ధాటికి అల్లాడి పోతున్నారు. బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకి రాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఈ క్రమంలో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత సైతం నమోదైంది. దీన్ని బట్టి రాష్ట్రంలో ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

Also Read: Kalima In Islam: కల్మా పేరుతో ఉగ్రవాదుల ఊచకోత.. ఇంతకీ అది ఏం చెబుతుందో తెలుసా?

అయితే గడిచిన 24 గంటల్లో ఎండ తీవ్రతకు 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో ముగ్గురు, పెద్దపల్లి జిల్లాలో ఒకరు, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కరు, సూర్యాపేట జిల్లాలో ఒక్కరు, నిర్మల్ జిల్లాలో ఒక్కరు, కరీంనగర్ జిల్లాలో ఒక్కరు, వరంగల్ జిల్లాలో ఒక్కరు, జనగామ జిల్లాలో ఒక్కరు, ములుగు జిల్లాలో ఒక్కరు ఎండ తీవ్రతను తట్టుకోలేక చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. వడదెబ్బ మృతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి వివరాలు రావాల్సి ఉంది.

Also Read This:Moist Killed: వరంగల్ లో భీకర ఎదురు కాల్పులు.. ఐదుగురు మృత్యువాత?

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్