Pravasthi Aaradhya: ప్రముఖ ఛానెల్ లో ప్రసారమయ్యే పాడుతా తీయగా షో గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే, తాజాగా ఈ షో పై సింగర్ ప్రవస్తి ఆరాధ్య (Pravasthi Aaradhya) సంచలన ఆరోపణలు చేసింది. ” బాలు గారు ఉన్నప్పుడు మంచిగా ఉంది. ప్రస్తుతం, పాడుతా తీయగా అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోంది. పాడుతా తీయగాలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. కీరవాణి కంపోజ్ చేసిన పాటలు పాడితేనే ఎక్కువ మార్కులు ఇస్తారన్న ప్రవస్తి ఆరాధ్య. పెళ్లిళ్లలో పాటలు పాడానంటూ తనను అవమానించారని మీడియా ముందు చెప్పిందని చెప్పింది.
Also Read: Bill Collector Suspended: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో తప్పుడు సమాచారం.. ఉద్యోగి సస్పెండ్!
ఆమె ఇంకా మాట్లాడుతూ .. కీరవాణి ( MM Keeravani) పై ఆరోపణలు చేసినందుకు తనపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిపింది. ఆ షో లో అందరి కంటే సునీత ( Singer Sunitha ) ఎక్కువ టార్చర్ చేసేదని చెప్పుకొచ్చింది. నేను ఎవరికీ భయపడను. ఏం జరిగినా అయినా సరే అందరికీ నిజం తెలియాలనే వీడియో పోస్టు చేస్తున్నానని తెలిపింది. వచ్చే ఎపిసోడ్ లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వబోతున్నారని తెలిపింది. సెట్ లో తనను బాడీ షేమింగ్ కూడా చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. షూటింగ్ జరుగుతున్నప్పుడు తనని ఓ చీడపురుగులా చూశారని తన బాధను బయటకు చెప్పుకుంది. తమిళ్ లో ఎన్నో పాటలు పాడానని, అక్కడ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురవ్వలేదని సింగర్ ప్రవస్తి ఆరాధ్య ఆరోపించింది. ఆమెకి ఎంత బాధ గలిగితే, ఎంత హర్ట్ అయితే ఇలా మీడియాకి ముందుకు వచ్చి తన బాధను చెప్పుకుంటాది. మొత్తానికి సింగింగ్ ఇండస్ట్రీలో కూడా ఆధిపత్య పోరు జరుగుతుందని ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది. మరి, ఈ దీనికి ఎక్కడ బ్రేక్ పడుతుందో చూడాలి మరి!