Indiramma Housing scheme (image credit:Twitter)
తెలంగాణ

Indiramma Housing scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు బిగ్ అప్ డేట్.. ఇలా చేస్తే క్షణాల్లో డబ్బులు జమ..

Indiramma Housing scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి నిరుపేద సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల‌కు రూ. 20.19 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. లబ్దిదారుల ఖాతాల్లో ఈ నిధులు జమ కానున్నాయి.

ఖాతాలు చెక్ చేసుకోండి
బేస్‌మెంట్ పూర్తి చేసుకున్న ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల‌కు రూ. 20.19 కోట్ల రూపాయిల‌ను నేరుగా వారి బ్యాంకు ఖాతాల‌లో జ‌మ‌చేయ‌డం జ‌రిగింద‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. మొద‌టి విడ‌త‌లో పైల‌ట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేసిన 70,122 ఇండ్లలో బేస్ మెంట్ పూర్తి చేసుకున్న 2019 మందికి ల‌క్ష రూపాయిల చొప్పున రూ. 20.19 కోట్ల రూపాయిల‌ను విడుద‌ల చేశామ‌ని మంత్రి తెలిపారు. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాకూడా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి ఆటంకం ఏర్పడ‌కుండా నిధులు విడుద‌ల చేస్తామ‌న్నారు.

13,500 ఇండ్లు గ్రౌండింగ్ పూర్తి
ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని , గ్రౌండింగ్ అయిన ఇండ్ల నిర్మాణ ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతం చేస్తున్నామ‌ని ఇప్పటికి 13,500 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయ‌ని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 12 మంది ల‌బ్దిదారుల‌కు మంగ‌ళ‌వారం లాంఛ‌నంగా ల‌క్ష రూపాయిల చొప్పున చెక్కుల‌ను అంద‌జేశారని తెలిపారు. మ‌ధ్యవ‌ర్తుల ప్రమేయానికి తావులేకుండా నాలుగు విడ‌త‌ల్లో ల‌బ్దిదారుల‌కు నేరుగా వారి ఖాతాలోనే జ‌మ‌చేస్తామ‌ని తెలిపారు. నిర్మాణం పూర్తైన వెంట‌నే బేస్ మెంట్ పూర్తైన త‌ర్వాత ల‌క్ష రూపాయిలు, గోడ‌లు పూర్తైన త‌ర్వాత 1.25 ల‌క్షల రూపాయిలు, శ్లాబ్ పూర్తిచేసుకున్న త‌ర్వాత 1.75 ల‌క్షల రూపాయిలు, ఇల్లు పూర్తైన త‌ర్వాత మిగిలిన ల‌క్ష రూపాయిలు విడుద‌ల చేస్తామ‌ని వివ‌రించారు.
Also Read: Mahabubabad district: ఆ జిల్లాకు మరో అరుదైన గౌరవం.. అదేంటంటే!

ఇలా చేస్తే.. మీ ఖాతాలో డబ్బు
బేస్‌మెంట్ గాని గోడ‌లు గాని శ్లాబ్‌గాని నిర్మాణం పూర్తిచేసుకుంటే అధికారుల కోసం ఎదురుచూడ‌కుండా ల‌బ్దిదారులే ఫోటో తీసి మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేసినా కూడా డ‌బ్బులు ల‌బ్దిదారుల ఖాతాలో జ‌మ‌చేస్తామ‌ని మంత్రి పొంగులేటి తెలిపారు. క‌నీసం 400 ఎస్ ఎఫ్ టి కి త‌గ్గకుండా 600 ఎస్ ఎఫ్‌టీకి మించ‌కుండా ల‌బ్దిదారులు ఇంటిని నిర్మించుకోవాల‌ని సూచించారు. అర్హులైన ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల ఎంపిక ప్రక్రియ మ‌రింత వేగ‌వంతం చేయ‌డం, అధికారుల‌కు , ప్రజాప్రతినిధుల‌కు స‌మ‌న్వయం ఉండేలా ప్రతి నియోజ‌క‌వ‌ర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియ‌మిస్తున్నామ‌ని తెలిపారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు