Complaints on Rajini: మాజీ మంత్రి విడదల రజినీకి బిగ్ షాక్..
Complaints on Rajini [ image credit; twitter]
గుంటూరు

Complaints on Rajini: మాజీ మంత్రి విడదల రజినీకి బిగ్ షాక్..

Complaints on Rajini: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత విడదల రజినీపై వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం చిలకలూరిపేటలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్‌లో పసుమర్రు రైతులు రజినీపై రెండు ఫిర్యాదులు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రజినీ మామ లక్ష్మీ నారాయణ పసుమర్రులో రోడ్డును ఆక్రమించుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు.

ఆక్రమించుకున్న స్థలానికి గోడకట్టారని, అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఆ స్థలాన్ని పసుమర్తి పంచాయతీకి లక్ష్మీ నారాయణ రాసిచ్చారని వివరించారు. పంచాయతీకి రాసిచ్చిన స్థలంపై లక్ష్మీ నారాయణ కొడుకు రాము కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని రైతులు పేర్కొన్నారు.

 Also READ: Hyderabad Local Body Elections: జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్.. అందరి చూపు అటువైపే..

ఇక, పసుమర్రులో జగనన్న కాలనీ కోసం ప్రభుత్వం 200 ఎకరాలు పొలం కొనుగోలు చేసిందని, భూములు ఇచ్చిన రైతుల నుంచి లంచం తీసుకున్నారని పేర్కొన్నారు. లంచం తీసుకున్న డబ్బులో కొంతమేర తిరిగిచ్చారని, ఇంకా నలభై లక్షలు ఇవ్వాల్సి ఉందని పసుమర్రు రైతులు వాపోయారు. విడుదల రజినీ, ఆమె లక్ష్మీనారాయణ, మరిది రాము పేర్లను రైతులు ఫిర్యాదు చేర్చారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..