Case Filed on KTR: మార్ఫింగ్ ఎఫెక్ట్.. కేటీఆర్ పై కేసు నమోదు
Case Filed on KTR
Telangana News

Case Filed on KTR: మార్ఫింగ్ ఎఫెక్ట్.. నేరుగా కేటీఆర్ పై కేసు నమోదు

Case Filed on KTR: బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ అండ చూసుకొని కొందరు రెచ్చిపోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వికృతంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన మెుయినాబాద్ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. మెుయినాబాద్ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ సహా మరో 8మందిపై కేసులు పెట్టారు. వారందరిపై బీఎన్​ఎస్​ 196, 352 రెడ్​ విత్​ 3(5) సెక్షన్ల కింద వారిపై అభియోగాలు మోపారు.

కేటీఆర్ ప్రోద్భలంతోనే..

బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన కె.విజయ్​ రావు, డాక్టర్​ కందుల మచ్చు, కె.యాదగిరి, రవికిరణ్​, మురళి, అనిల్​, వర్ధన్, అభి తదితరులు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదుదారుడు మానయ్య పోలీసులకు తెలిపారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రోద్భలంతో సీఎం రేవంత్ ప్రతిష్టకు భంగం కలిగేలా వారు అసభ్యకర రీతిలో మార్ఫింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫేక్ వీడియోలను సృష్టించి సోషల్​ ప్లాట్​ ఫాంలలో అప్​ లోడ్​ చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందటానికే వీళ్లంతా కలిసి కుట్ర చేస్తున్నట్లు పోలీసులకు తెలియజేశారు. వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని మానయ్య కోరారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన మెుయినాబాద్ పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో కేటీఆర్ అరెస్టు తప్పదని పొలిటికల్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Also Read: Shock to Jagan: జగన్ కు దెబ్బ మీద దెబ్బ.. త్వరలో వైకాపా ఖాళీ?

Just In

01

Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!

Mathura Bus Fire: బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీ–ఆగ్రా హైవేపై బస్సు ప్రమాదం.. నలుగురు మృతి