Akhanda 2 – Thaandavam: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ మూవీస్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమాతో నాల్గవ సారి వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ‘అఖండ’కు సీక్వెల్గా రూపుదిద్దుకుంటున్న చిత్రమే ‘అఖండ 2: తాండవం’. మొదటి పార్ట్ ఘన విజయం సాధించడంతో, ఈ సీక్వెల్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. నటసింహం బాలయ్య కుమార్తె ఎం తేజస్విని నందమూరి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ అప్డేట్ విడుదల చేశారు.
Also Read- Senior Heroine: సెకండ్ ఇన్నింగ్స్కు రెడీ అంటున్న సీనియర్ హీరోయిన్
హిమాలయాల్లో రెక్కీ
‘అఖండ 2: తాండవం’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇటీవల మహా కుంభ మేళాలో కూడా దర్శకుడు బోయపాటి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం హిమాలయాల్లో రెక్కీ నిర్వహిస్తున్నారని మేకర్స్ ఈ అప్డేట్లో తెలిపారు. హిమాలయాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఎక్స్ట్రార్డినరీ సన్నివేశాలను చిత్రీకరించడానికి బోయపాటి ప్లాన్ చేశాడని, అందుకే అక్కడి ప్రదేశాలపై ఆయన రెక్కీ నిర్వహిస్తున్నాడని మేకర్స్ చెబుతున్నారు. హిమాలయాల్లో చిత్రీకరించే ఈ సన్నివేశాలు ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అవుతాయని అంటున్నారు. ‘అఖండ’ సినిమాలో కూడా ఎవరూ ఊహించని విధంగా ఓ యాక్షన్ ఎపిసోడ్ని బాలయ్య నీళ్లలో ప్లాన్ చేసి, అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు తీయబోయే సన్నివేశాలు కూడా అలాగే ఉంటాయని అంటున్నారు.

హై బడ్జెట్తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సీక్వెల్లో బాలయ్య సరసన సంయుక్త హీరోయిన్గా కనిపించనుంది. యంగ్ హీరో ఆది పినిశెట్టిని రీసెంట్గానే ఓ కీలకమైన పాత్రకి ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. సంగీత సంచలనం ఎస్ థమన్ మళ్లీ బ్రహ్మాండమైన సంగీతాన్ని ఈ చిత్రానికి రెడీ చేస్తున్నారు. ఇంకా అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను దసరా పండుగను పురస్కరించుకుని 25 సెప్టెంబర్, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ఇక బాలయ్య విషయానికి వస్తే, రీసెంట్గా ‘డాకు మహారాజ్’ అంటూ మరో సెన్సేషనల్ హిట్ కొట్టారు. సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా మాస్ని బాగా ఆకట్టుకుంది. బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులోని బాలయ్య పాత్రకు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు.
ఇది కూడా చదవండి:
Anasuya: మరోసారి అనసూయకు విరాట్ కర్ణ సినిమాలో ఛాన్స్