Tuesday, July 2, 2024

Exclusive

Bus Accident : ఘోర బస్సు ప్రమాదం 45 మంది దుర్మరణం, 8 ఏళ్ల బాలిక సజీవం

South Africa Road Accident: ప్రపంచంలో ఏదో ఒక మూలనా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బోట్స్‌వానా నుంచి మోరియా వెళ్తున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడింది. జోహన్నెస్‌ బర్గ్‌కు ఉత్తరాన 300 కి.మీ దూరంలో ఉన్న లింపోపో ప్రావిన్స్‌లోని మమట్లకాల సమీపంలో రెండు కొండలను కలిపే వంతెనపై నుంచి బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 45 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈస్టర్‌ పండుగ కోసం జియాన్ చర్చికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిన టైంలో బస్సులో నుండి భారీగా మంటలు చెలరేగడంతో బస్సు స్వల్పంగా దగ్దమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో అనూహ్యంగా 8 ఏళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ బాలికను స్థానిక దవాఖానకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో పూర్తిగా బస్ దగ్దం అయ్యింది. ఈ ప్రమాదం జరిగే సమయానికి 46 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు 46 మంది ఉండగా అందులో ఒక చిన్నారి మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ప్రమాదానికి కారణం. బస్ డ్రైవర్ తన కంట్రోల్‌ పవర్‌ని తప్పడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారంతా శిథిలాల కింద చిక్కుకోవడంతో వారిని బయటకి తీయడానికి కష్టతరంగా మారింది.

Read Also : బిక్కుబిక్కుమంటున్న గాజా, ఆహారం కోసం వెళ్లి 18 మంది మృతి

ఇక బస్సు ప్రమాదం వంతెనపై డివైడర్లను ఢీకొట్టడంతో లోయలోకి పడిపోయినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీంతో అక్కడ మంటలు భారీగా వ్యాపించినట్టు ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైందని వెల్లడించారు. ఈ ఘటనాస్దలానికి రవాణా శాఖ మంత్రి సింధిసివే చికుంగా చేరుకొని అక్కడి ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కష్టకాలంలో మృతదేహాలను బాధిత కుటుంబసభ్యులకు అప్పగించేందుకు దక్షిణాప్రికా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని భరోసాని కల్పించారు. ఈస్టర్ వారంతంలో ఎక్కువమంది ప్రజలు రోడ్లపైకి ప్రయాణిస్తున్నారని.. డ్రైవింగ్ చాలా అప్రమత్తంగా చేయాలని సూచిస్తున్నట్టు కూడా గుర్తుచేశారు.

గతంలోనూ ఈస్టర్ సందేశంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సురక్షితమైన ఈస్టర్‌గా మార్చడానికి ప్రజలు తమ వంతు కృషి చేయాలని కోరారు. మన రోడ్లపై విషాదాలు, గాయాలకు సంబంధించిన గణాంకాలను చూసేందుకు వేచి ఉండే సమయం ఉండకూడదని అన్నారు. ఈస్టర్ వారంలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలను వహించాలని కోరారు. ఆయన ఈ మాటలు చెప్పిన కొన్ని గంటలకే ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద విషయం తెలుసుకున్న సిరిల్.. బాధిత కుటుంబసభ్యులకు తమ సంతాపం తెలిపారు.

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

International :ఛాన్స్ ఇస్తే మారణహోమం ఆపేస్తా

రష్యా -ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఎంతమాత్రం సాధ్యం కాదంటున్న రష్యా ఉక్రెయిన్ సమస్య ఒక్క రోజుతో పరిష్కారమయ్యేది కాదన్న రష్యా బలమైన అధ్యక్షుడు ఉంటే యుద్ధం జరిగేది...

International news:కిమ్ అరాచకం

దక్షిణ కొరియా పాటలు విన్నాడని బహిరంగంగా ఉరి మితిమీరిపోయిన కిమ్ నియంతృత్వ ధోరణి దక్షిణ హ్వాంగ్‌హే ప్రావిన్స్‌‌‌కు చెందిన వ్యక్తికి కఠిన శిక్ష శతృదేశాలకు చెందిన సినిమాలు, పాటలపై నిషేధం మానవహక్కుల...

International: భారతీయులూ.. బయటకు రావద్దు

అలర్ట్ జారీ చేసిన కెన్యా లోని భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ పన్నుల పెంపునకు నిరసనగా కెన్యాలో దేశవ్యాప్త ఆందోళనలు రోజురోజుకూ హింసాత్మకంగా మారుతున్న ఆందోళనలు పార్లమెంట్ ప్రాంగణంలో మిన్నంటిన గొడవలు ...