Tuesday, July 2, 2024

Exclusive

ప్రైవేటు టీచర్ల గోస పట్టించుకోరూ..!

విద్యార్థులకు అక్షర భిక్షను పెట్టి వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా మలచేది ఉపాధ్యాయులే. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్ల కంటే 30 శాతం ఎక్కువ టీచర్లు ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నారు. అధికారిక లెక్క ప్రకారం.. తెలంగాణలో సుమారు 1.25 లక్షలకు పైగా ప్రైవేటు టీచర్లుండగా, ప్రభుత్వం లెక్కల్లోకి ఎక్కకుండానే స్కూళ్లలో పనిచేస్తున్న వారి సంఖ్య మరో 75 వేలు ఉంటుందని అంచనా. వీరిలో 60 శాతం మంది టీచర్లు.. కనీస ఉద్యోగ భద్రత, పీఎఫ్ వంటి కనీస సౌకర్యాలకు నోచుకోకుండా బతుకు బండిని నెట్టుకొస్తున్నారంటే నమ్మాల్సిందే. గత పదేళ్ల కాలంలో టీచర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల తప్ప మిగిలిన ఏ సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యల మీద దృష్టి పెట్టాలని వారంతా కోరుతున్నారు.

వినటానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. ప్రైవేటు టీచర్ల జీవితాలు ఈ రోజు వెట్టిచాకిరి బానిసలకంటే దౌర్భాగ్యంగా ఉన్నాయి. గత పదేళ్లలో ప్రైవేటు స్కూళ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పట్టు కోల్పోయింది. వీధికొక స్కూలు వస్తున్నా, వాటిలో అనుమతులున్నవెన్నో తెలియని పరిస్థితి. వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేసే ఈ స్కూళ్లలో రోజంతా నిలబడి పనిచేసే గొంతుపోయేలా పాఠాలు చెప్పే టీచర్లలో సగం మందికి ఉపాధి హామీ కూలీకి దక్కే వేతనం దక్కటం లేదు. వీరిలో చాలామంది ఏళ్ల తరబడి టీచరు నోటిఫికేషన్లు లేక.. వయసు దాటిపోయి, సమీపంలోని ప్రైవేటు స్కూల్స్‌లో పని చేస్తూ చాలీచాలని జీతంతో కుటుంబాలను పోషించుకుంటున్న వారు కొందరైతే.. ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవంతో రాజీ పడుతూ బతికేవారు మరికొందరు.

ప్రైవేటు స్కూళ్లలో టీచర్లకు మార్చి నెల వచ్చిందంటే నరకం గుర్తుకు వస్తుంది. స్కూలు సమయం తర్వాత వీరు విద్యార్థుల ఇండ్లకు వెళ్లి వారి తల్లిదండ్రులను ఒప్పించి, అడ్మిషన్లు చేయించాలి. మేనేజ్‌మెంట్ వారు చెప్పినన్ని అడ్మిషన్లు చేయని టీచర్లకు వచ్చే ఏడాది ఉద్యోగం లేనట్లే. ఎలాగూ ఏప్రిల్, మే వేతనాలు ఇవ్వరు గనుక.. మరో మార్గం లేక టీచర్లు ఇంటింటికీ తిరగాల్సి వస్తోంది. ఒంటిపూట బడుల రోజుల్లో ఎర్రటి ఎండల్లో వీరిని అడ్మిషన్ల కోసం పంపే మేనేజ్‌మెంట్లు.. వీరి వేతన పెంపు దగ్గరకు వచ్చే సరికి ‘మీ తరగతిలో పిల్లలకు గొప్ప మంచి మార్కులు రాలేదు’ అంటూ గొణగటం మామూలే.

మన సమాజంలో ఏ సంఘం లేకుండా.. ఎవరికి వారే అన్నట్లు పనిచేసే ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే.. అది ప్రైవేటు టీచర్లే. కాబట్టి తమ సమస్యలపై వీరు కలిసి కట్టుగా పోరాటం చేయలేకపోతున్నారు. ప్రయివేటు టీచర్స్‌ ఎవరైనా సంఘం పెట్టినట్టు తెలిసినా, తమ పాఠశాలలో పని చేసే టీచర్లు అందులో చేరినా వారి ఉద్యోగాన్ని తొలగించటమే కాకుండా, వారికి మరే ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం రాకుండా యాజమాన్యాలు చేయటం ఇక్కడ చాలా కామన్‌గా జరిగే వ్యవహారం. కనుక పోరుబాట పట్టి కుటుంబాన్ని పస్తులుంచలేక.. వీరంతా ఏ సంఘంలోనూ చేరేందుకు ముందుకు రాలేని దుస్థితి నెలకొంది.

విద్యార్థుల ప్రతిభా పాటవాలను బట్టి వారికి వచ్చే మార్కులు ఆధారపడి ఉంటాయి. కానీ.. ప్రైవేటు స్కూళ్లలో మాత్రం వెనకబడిన విద్యార్థికీ వందకు తొంభై మార్కులు రావాలని తల్లిదండ్రులు భావిస్తారు. ఈ విషయంలో అటు మేనేజ్‌మెంట్, ఇటు తల్లిదండ్రుల దృష్టిలో టీచరునే దోషిగా నిలబెడుతున్నారు తప్ప విద్యార్థి లెర్నింగ్ స్కిల్స్, యాటిట్యూడ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవటం లేదు. దీనికి తోడు విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లను భర్తీ చేసుకోని యాజమాన్యాలు, ఒక్కో టీచరుకు ఆరు అంతకంటే ఎక్కువ క్లాసులు అప్పగిస్తున్నారు. ఒక్కో క్లాసులో 70 మంది విద్యార్థులున్న ఈ క్లాసుల్లో ప్రతి విద్యార్థి మీదా టీచరు ఎలా దృష్టి పెడతారనే ప్రశ్నే ఇక్కడ ఉండదు. అలాగే.. స్కూలులో విద్యార్థుల మధ్య జరిగే గొడవలకూ టీచరు నిర్లక్ష్యాన్నే కారణంగా చూపే పరిస్థితి నేడు నెలకొంది.

ప్రైవేటు స్కూల్స్‌లో నెలకు ఒక సెలవు కంటే ఎక్కువ పెడితే వేతనం కట్ చేయటం కామన్. నెలలో వచ్చే 4 ఆదివారాలు పోనూ ఒక సెలవు మాత్రమే ఉండే ఈ స్కూళ్లలో అంతకంటే ఎక్కువ సెలవులు పెరిగితే శాలరీ కోసిపారేస్తారు. చాలా స్కూళ్లలో ఆదివారానికి ముందు, తర్వాతి రోజు సెలవు పెడితే.. రెండు రోజుల జీతం కట్. అనారోగ్యం గానీ అత్యవసరంగా సెలవు కోరితే ఇచ్చే అవకాశం బహు తక్కువ. గ్రామం, మండలం స్థాయిలో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో రోజుకు 9 గంటల పాటు పనిచేసే టీచర్లలో సగం మంది వేతనాలు రూ. 9 నుంచి 12 వేల మధ్యనే ఉన్నాయి. ఇక పదో తరగతి పిల్లలకు బోధించే టీచర్లు రాత్రి 8 గంటల వరకు బడిలో ఉండాల్సిందే. దీనికి అదనంగా చెల్లించేది ఏమీ ఉండదు.

స్కూలు యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర 12 నెలల ఫీజులు వసూలు చేస్తారు. కానీ.. టీచర్లకు మాత్రం పది నెలలకే జీతం అందుతుంది. ఏప్రిల్, మే నెలలకూ వేతనం ఇచ్చే స్కూళ్లు మొత్తం తెలంగాణలో కేవలం 5 శాతం మాత్రమేనంటే.. నమ్మాల్సిందే. తెలంగాణలోని వందలో 20 శాతం స్కూళ్లలో టీచర్లకి పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు కూడా లేవు. వీరికి నేరుగా వేతనాన్ని నగదు రూపంలో అందిస్తున్నారు. దీనివల్ల వీరికి ప్రభుత్వ పరంగా అందే వైద్యసదుపాయం, మెటర్నిటీ లీవ్ వంటివి ఏమీ అందవు. ఇక.. కరోనా సమయంలో ప్రైవేటు టీచర్లు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.

గత పదేళ్లలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు మరింతగా ప్రైవేటు టీచర్ల కష్టాన్ని దోచుకుంటున్నాయి. కళ్లముందు ఇంత జరుగుతున్నా, విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తప్ప రాజకీయ పార్టీలు ప్రైవేటు టీచర్ల సమస్యల్ని ప్రస్తావించకపోవటం దురదృష్టకరం. ఇకనైనా కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలను కట్టడి చేయటంతో బాటు ఇక్కడ పనిచేసే టీచర్ల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాల్సి ఉంది.

– నెక్కంటి అంత్రివేది
సామాజిక కార్యకర్త

Publisher : Swetcha Daily

Latest

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

Don't miss

Kishan Reddy: హిందూ ద్వేషి

- ప్రతిపక్ష నేతగా రాహుల్ వ్యాఖ్యలు దురదృష్టకరం - ఇన్నాళ్లూ బీజేపీ, మోదీపై...

Job Notifications: ఇక కొలువుల జాతర

- వరుస ఉద్యోగ నోటిఫికేషన్లకు సర్కారు సై - జాబ్ కేలండర్ తయారీలో...

Congress Party: ఢిల్లీలో తలసాని..

- కాంగ్రెస్‌లో చేరికకు యత్నాలు - అఖిలేష్ యాదవ్ ద్వారా రాయబారం - మంత్రి...

PM Narendra Modi: రాహుల్ గాంధీలా చేయొద్దు!

- ప్రధాని కుర్చీని దశాబ్దాల పాటు ఒకే కుటుంబం పాలించింది - మ్యూజియంలో...

Cabinet Expansion: 4న మంత్రివర్గ విస్తరణ

- కొత్తగా నలుగురికి అవకాశం - సామాజిక సమీకరణాలే కీలకం - మంత్రుల శాఖల్లో...

National: మూడోసారి ప్రధాని కావడం జీర్ణించుకోలేకపోతున్నారు

ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ రాహుల్ లా ప్రవర్తించకండంటూ ఎంపీలకు సూచన అధికార, మిత్ర పక్షాల నేతలకు దిశానిర్దేశం మీడియా కామెంట్స్ కు ముందు ఆ సమస్యపై స్టడీ...

National news:మహారాష్ట్రలో ‘జికా’ కలకలం

2 Pregnant Women Test Positive For Zika Virus In Pune Total Rises To 6 భారత్ లో జికా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్రలోని పూణెలో ఆరు జికా వైరస్‌ కేసులు...

National news: రైజింగ్ రాహుల్

ప్రతిపక్ష నేతగా ఆకట్టుకున్న రాహుల్ తొలి ప్రసంగం రాహుల్ ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయిన మోదీ మోదీని ఇరుకున పెట్టిన రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో దేవుడితో తనకు కనెక్షన్ ఉందన్న మోదీ ...