Ravichandran Ashwin Blast On Pakistan Journalist Tags To Elonmusk: భారత్పై అసూయతో ఓ పాక్ జర్నలిస్టు చేసిన పోస్ట్ టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్కు కోపం తెప్పించింది. పైగా అది తన టైమ్లైన్లో కన్పించడంతో తీవ్ర అసహనానికి గురైన ఈ సీనియర్ స్పిన్నర్ వెంటనే ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్కు రిక్వెస్ట్ పెట్టాడు. తన ఇంట్లోకి ఎవరు రావాలో తానే డిసైడ్ చేయాలన్నాడు.
అసలు మ్యాటర్ ఏంటంటే టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఈసారి సంచనాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్-8లో మాజీ ఛాంపియన్, మేటి జట్టు ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ విజయం సాధించి అందర్నీ షాక్కి గురిచేసింది. ఈ మ్యాచ్పై పాకిస్థాన్కు చెందిన జర్నలిస్టు వజాహత్ కజ్మీ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు.
Also Read: టీ20 వరల్డ్ కప్లో టీమ్కి షాక్
అందులో భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అఫ్గానిస్థాన్ ఈ ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలదు కానీ భారత్పై గెలవలేదు. అందుకు స్పష్టమైన కారణం ఐపీఎల్ కాంట్రాక్టులు చాలా కాస్ట్లీ అంటూ అతడు నోరు పారేసుకున్నాడు. అయితే ఈ పోస్ట్ని అశ్విన్ మస్క్ను ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.