Wednesday, June 26, 2024

Exclusive

Hyderabad:బడ్జెట్ కు వేళాయె

  • జులై మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
  • ఎన్నికల ముందు ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కార్
  • పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు
  • రైతుబంధు, రుణమాఫీ అంశాలపై చర్చ
  • ధరణి సమస్యలపై ఫోకస్
  • కేంద్ర బడ్జెట్ పూర్తయ్యాకే రాష్ట్ర బడ్జెట్
  • కేంద్ర బడ్జెట్ లో రాష్ట్ర కేటాయింపులపై ఉత్కంఠ
  • రాష్ట్ర ఆదాయం పెంచే వనరులపై కీలక నిర్ణయాలు

Telangana state assembly sessions may be july first week Budget :

జులై మొదటివారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదలు కానున్న ఈ సమావేశాలు పూర్తిస్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది.ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్ స్థానంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంతో పాటు తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు, రైతు బంధు, రుణమాఫీ తదితర అంశాలు అసెంబ్లీ సమావేశాలలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక గత సర్కార్ పాలనలో అనేక ఆరోపణలు వచ్చిన ధరణి సమస్యలపైనా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఈ అసెంబ్లీ సమావేశాలలో ధరణి పేరు మార్పు అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే భూమాత అనే పేరును నామమాత్రంగా సూచించారు.

పూర్తి స్థాయి బడ్జెట్ పై కసరత్తు

ఫిబ్రవరిలో జరిగిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలలకు సరిపడ బడ్జెట్ పద్దులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నాలుగు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరం అయిన నిధుల ను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం ఈనెలలోనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులను ఆధారంగా చేసుకుని ఈ ఆర్థిక సంవత్సరం లో మిగిలిన 8 నెలలకు అవసరం అయిన బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది.

రుణమాఫీ, భరోసా

రైతు భరోసా, రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో కట్ ఆఫ్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో వ్యవసాయం చేయని వారికి వేల ఎకరాలు ఉన్న వారికి కొండలు ,రోడ్లు ఉన్న భూములకు రైతు బంధు ఇచ్చారని అధికార పార్టీ విమర్శలు చేస్తుంది.. ఈ నేపథ్యంలో రైతుభరోసా కింద నిజమైన సాగుదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఐదు ఎకరాల వరకు సీలింగ్ పెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే వారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం అయి రైతులను ఇచ్చే పంట సహాయం ,రుణమాఫీపై కట్ ఆఫ్ పెట్టనుంది ప్రభుత్వం.

పలు కీలక నిర్ణయాలు

కౌలు రైతులకు సైతం పంట పెట్టుబడి సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై నిర్ణయం ప్రకటించేందుకు ప్రభుత్వం రెడీ అవుతుంది. వీటితో పాటు పాలనలో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి పారుదల రంగాల్లో పారదర్శకత ,జవాబుదారీతనం పెంచే విధంగా చర్యలు తీసుకుంటుంది..అందులో బాగంగా మొదట విద్య, వ్యవసాయ రంగాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం విద్య కమీషన్, రైతు కమీషన్ లను ఏర్పాటు చేస్తుంది .వీటితో పాటు తెలంగాణ తల్లి ,తెలంగాణ చిహ్నంపై చర్చ జరుగనుంది..మొత్తం గా ఈసారి బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది.సమావేశాలు ఇంకా ఎలాంటి అజెండా తో నిర్వహించనున్నారో వేచి చూడాలి.

Publisher : Swetcha Daily

Latest

KTR: నయవంచనకు ప్రతిరూపం

- ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటుంది - ఇంకోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది -...

BRS Party: గులాబీ వల‘సలసల’

- తగ్గుతున్న బీఆర్ఎస్ సంఖ్యా బలం - ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎమ్మెల్యేలు...

Rythu Bharosa: కీలక సమీక్ష

- గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి?...

IRCTC: రైల్వే టికెట్ల బుకింగ్‌పై అవాస్తవ ప్రచారం

Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్ పై కొన్ని రోజులుగా సోషల్...

Phone Tapping: బెయిల్ పిటిషన్ వాయిదా

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో...

Don't miss

KTR: నయవంచనకు ప్రతిరూపం

- ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటుంది - ఇంకోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది -...

BRS Party: గులాబీ వల‘సలసల’

- తగ్గుతున్న బీఆర్ఎస్ సంఖ్యా బలం - ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎమ్మెల్యేలు...

Rythu Bharosa: కీలక సమీక్ష

- గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి?...

IRCTC: రైల్వే టికెట్ల బుకింగ్‌పై అవాస్తవ ప్రచారం

Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్ పై కొన్ని రోజులుగా సోషల్...

Phone Tapping: బెయిల్ పిటిషన్ వాయిదా

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో...

Hyderabad PS: అసదుద్దిన్‌ కౌంటర్‌కి పోలీసుల రీ-కౌంటర్‌

-పోలీసుల నిర్ఱయం వివాదస్పదం -నో ఫ్రెండ్లీ పోలీసింగ్‌, ఓన్లీ లాఠీచార్జ్‌ -పోలీసులపై మండిపడ్డ అసదుద్ధిన్‌ -ఇది మెట్రో సిటీనా, పల్లెటూరా..? -అసదుద్ధిన్‌కి పోలీసులు కౌంటర్‌ -పాత నిబంధనల ప్రకారమే ఈ అనౌన్స్‌మెంట్‌ -ట్విట్టర్‌ వేదికగా సౌత్‌ జోన్‌ డీసీపీ స్నేహా మెహ్రా...

Telangana: ‘కోల్’కో లేని దెబ్బ

బొగ్గు వేలంపై బీఆర్ఎస్ డబుల్ డ్రామా తాడిచెర్ల బొగ్గు గనిని ఆంధ్రా కంపెనీకి ధారాదత్తం 2015లో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మినరల్స్ అండ్ మైన్స్ చట్ట సవరణ చట్ట సవరణకు బాహాటంగానే...

Hyderabad:‘మెట్రో’ఆదాయం పెరిగింది

Hyderabad Metro income increased 105 percent better than last year: నిత్యం అనేక వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది హైదరాబాద్ మెట్రో.తొలినాళ్లలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా...