Wednesday, June 26, 2024

Exclusive

Hyderabad:ముంపు నీరు సంపులోకి

Hyderabad rain water sending through sumps solutions from floods:
హైదరాబాద్ నగరం పేరుకు విశ్వనగరం..వానొస్తే నరకం. కొద్దిపాటి వానస్తే చాలు మెయిన్ రోడ్డలలో నీరు నిలిచిపోతుంది. దీనితో వాహనదారులు నానా యాతన పడుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యపై ఏనాడూ దృష్టి పెట్టకపోవడంతో వానాకాలంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతన్నాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ఖరీదైన వస్తువులన్నీ పాడైపోతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. అయితే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇకపై ఈ సమస్యలకు పరిష్కారం లభించనుంది. జీహెచ్ఎంసీ అధికారులు దీనిపై కార్యాచరణ సిద్ధం చేశారు. నెల రోజుల వ్యవధిలో దీనికి సంబంధించిన పనులను పురపాలక శాఖ ఆధ్వర్యంలో బల్దియా అధికారులు మొదలు పెట్టి పూర్తి చేయబోతున్నారు. వర్షాలతో చెరువులుగా మారే ప్రాంతాల్లో దానికి సమాంతరంగా పెద్ద సంపు తవ్వి అందులోకి మళ్లించే ఏర్పాటు చేయనున్నారు. ఈ సంప్‌ నుంచి నీటిని మోటార్లు ద్వారా సమీపంలోని అతిపెద్ద నాలాలకు తరలిస్తారు.

టెండర్లకు ఆహ్వానం

ఏకధాటిగా 2సెం.మీ.ల వర్షం పడితే చాలు దాదాపు 50చోట్ల చెరువుల్లా మారుతున్నాయి. ఇందులో 20 వరకు ప్రధాన ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలుస్తోంది. మొదటి దశలో 12 చోట్ల సంపులు నిర్మించాలని నిర్ణయించారు. పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఈ నెలాఖరుకే పనులు పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంపుల ఏర్పాటు

హైదరాబాద్‌ నుంచి శంషాబాద్‌ వెళ్లే మార్గంలో పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే కింది భాగంలో పిల్లర్‌ నంబర్‌ 264 శివరాంపల్లి దగ్గర భారీ వర్షం పడితే ఈ ప్రాంతం చెరువుగా మారుతోంది. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా దీనికి సమీపంలోని ప్రభుత్వ స్థలంలో 1.50లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపును నిర్మించనున్నారు. ఈ నీటిని వెంటవెంటనే మోటార్ల ద్వారా బుల్కాపూర్‌ నాలాలోకి తరలిస్తారు.హుస్సేన్‌సాగర్‌ చుట్టూ నీరు నిల్చే ప్రాంతాల్లోనూ ఇలాగే సంపుల నుంచి సాగర్‌లోకి పంపించనున్నారు.రాజ్‌భవన్‌ రోడ్డులోని లేక్‌ క్యూ అతిథి గృహం దగ్గర సంపును తవ్వబోతున్నారు. మొదటి దశ పనులు పూర్తయిన తరువాత రెండో దశలో మరికొన్నిచోట్ల నిర్మించాలని నిర్ణయించారు.

Publisher : Swetcha Daily

Latest

KTR: నయవంచనకు ప్రతిరూపం

- ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటుంది - ఇంకోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది -...

BRS Party: గులాబీ వల‘సలసల’

- తగ్గుతున్న బీఆర్ఎస్ సంఖ్యా బలం - ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎమ్మెల్యేలు...

Rythu Bharosa: కీలక సమీక్ష

- గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి?...

IRCTC: రైల్వే టికెట్ల బుకింగ్‌పై అవాస్తవ ప్రచారం

Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్ పై కొన్ని రోజులుగా సోషల్...

Phone Tapping: బెయిల్ పిటిషన్ వాయిదా

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో...

Don't miss

KTR: నయవంచనకు ప్రతిరూపం

- ఓవైపు రాజ్యాంగ పరిరక్షణ అంటుంది - ఇంకోవైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంది -...

BRS Party: గులాబీ వల‘సలసల’

- తగ్గుతున్న బీఆర్ఎస్ సంఖ్యా బలం - ఒక్కొక్కరుగా జారుకుంటున్న ఎమ్మెల్యేలు...

Rythu Bharosa: కీలక సమీక్ష

- గత ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిలిపేసిన పథకాలు ఏంటి?...

IRCTC: రైల్వే టికెట్ల బుకింగ్‌పై అవాస్తవ ప్రచారం

Ticket Booking: రైల్వే టికెట్ల బుకింగ్ పై కొన్ని రోజులుగా సోషల్...

Phone Tapping: బెయిల్ పిటిషన్ వాయిదా

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో...

Hyderabad PS: అసదుద్దిన్‌ కౌంటర్‌కి పోలీసుల రీ-కౌంటర్‌

-పోలీసుల నిర్ఱయం వివాదస్పదం -నో ఫ్రెండ్లీ పోలీసింగ్‌, ఓన్లీ లాఠీచార్జ్‌ -పోలీసులపై మండిపడ్డ అసదుద్ధిన్‌ -ఇది మెట్రో సిటీనా, పల్లెటూరా..? -అసదుద్ధిన్‌కి పోలీసులు కౌంటర్‌ -పాత నిబంధనల ప్రకారమే ఈ అనౌన్స్‌మెంట్‌ -ట్విట్టర్‌ వేదికగా సౌత్‌ జోన్‌ డీసీపీ స్నేహా మెహ్రా...

Telangana: ‘కోల్’కో లేని దెబ్బ

బొగ్గు వేలంపై బీఆర్ఎస్ డబుల్ డ్రామా తాడిచెర్ల బొగ్గు గనిని ఆంధ్రా కంపెనీకి ధారాదత్తం 2015లో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మినరల్స్ అండ్ మైన్స్ చట్ట సవరణ చట్ట సవరణకు బాహాటంగానే...

Hyderabad:‘మెట్రో’ఆదాయం పెరిగింది

Hyderabad Metro income increased 105 percent better than last year: నిత్యం అనేక వేల మంది ప్రయాణికులను గమ్యానికి చేరుస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది హైదరాబాద్ మెట్రో.తొలినాళ్లలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా...