Thursday, January 16, 2025

Exclusive

Warangal : ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు విద్యార్థులు మృతి

  • ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ఘటన
  • ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోపే
  • మంచి మార్కులు వచ్చాయని పార్టీ చేసుకున్న విద్యార్థులు
  • ఒకే బైక్ పై నలుగురు కలిసి ప్రయాణం
  • మలుపు వద్ద బైక్ ను ఢీకొన్ని ప్రైవేటు బస్సు
  • ఎన్నికల సభకు జనాన్ని తరలించి ఖాళీగా వెళుతున్న బస్సు
  • మృతులంతా తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం
  • ఇల్లంద గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు

 

Bike Accident Warangal : అప్పుడే పరీక్ష రిజల్ట్స్ వచ్చి కొన్ని గంటలైనా కాలేదు. ఇంటర్ లో మంచి మార్కులతో పాసై భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ విద్యార్థులను మృత్యువు రూపంలో వచ్చిన ఓ ప్రైవేటు బస్సు వారిని బలి తీసుకుంది. హృదయ విదారక ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది.

చావుకొచ్చిన పార్టీ

ఇంటర్ పరీక్షల్లో పాస్ అయిన నలుగురు ఇంటర్ విద్యార్థులను ఘోర రోడ్డు ప్రమాదం బలికొంది. బుధవారం విడుదలైన 2024 ఇంటర్ ఫలితాల్లో పాస్ అయినందుకు పొన్న గణేశ్, తన ముగ్గురు స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. దీంతో నలుగురు కలిసి ఓ ప్రాంతంలో పార్టీ చేసుకుని ఒకే బైక్ పై తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు బస్సు వారి బైక్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న నలుగురు దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరి పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పొయారు. మృతులు గణేష్, వరుణ్ తేజ్, పొన్నాల రనిల్, సిద్దు గా పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాలోని ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఒకే బైక్ పై నలుగురు

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్‌, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్‌ తేజ్‌, పొన్నాల రనిల్‌ కుమార్‌లు ఒకే ద్విచక్ర వాహనంపై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తున్నారు. ఓ మూలుపు మలుపు వద్ద ఎదురుగా బస్సు వస్తున్న విషయాన్ని వీరు గమనించలేదు. బస్సు డ్రైవర్ కూడా గమనించకపోవడంతో బైక్​ను బలంగా ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది. ఈ బస్సు హనుమకొండ జిల్లాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభకు ప్రజలను తరలించి తిరిగి ఖాళీగా వెళుతోంది. మరణించిన వారిలో గణేశ్‌ అనే విద్యార్థి బుధవారం వెల్లడైన ఇంటర్‌ ఫలితాల్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. . మృతులంతా వారి తల్లిదండ్రులకు ఒక్కరే కుమారులని స్థానికులు చెప్పారు. ఇల్లంద గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలం వద్ద మలుపు ఉండటం, రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోుదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Crime news: విజయ్ మాల్యా పై నాన్ బెయిలబుల్ వారెంట్

ఆదేశాలు జారీ చేసిన ముంబై స్పెషల్ కోర్టు రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసులో ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాలు సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకొని జారీ ఉద్దేశపూర్వకంగానే రుణ...

Land Encroachment: కాస్ట్లీ ఏరియాలో ఖతర్నాక్ కబ్జా!

ఫేక్ మనుషులు.. ఫోర్జరీ డాక్యుమెంట్లు..! - జూబ్లీహిల్స్‌లో భారీ భూ మాయ - 6 ఎకరాల ల్యాండ్.. కబ్జాకు ప్లాన్ - దొంగ వారసులు, ఫేక్ డాక్యుమెంట్లతో స్కెచ్ - నిందితుల్లో సాహితీ లక్ష్మినారాయణ బంధువు - గులాబీల పాలనలో...

MLC Kavitha: బెయిల్ ఇవ్వలేం..

- కవిత కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు - రెండు బెయిల్ పిటీషన్ల కొట్టివేత - సుప్రీం మెట్లేక్కే ఆలోచనలో కవిత Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్...